లోన్ మారటోరియానికి సంబంధించి రుణగ్రహీతలకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఆగస్ట్ 31వ తేదీలోపు ఎన్పీఏలుగా ప్రకటించని అకౌంట్స్ను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రుణ మారటోరయం కాలానికి గాను వడ్డీలపై వడ్డీ విధించడాన్ని సవాల్ చేస్తూ జారీ చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. వడ్డీపై వడ్డీని విధించడం పట్ల పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాయిదాలపై వడ్డీ విషయంలో పిటిషనర్ల ఆందోళనలను తాము అర్థం చేసుకున్నామని కోర్టు తెలిపింది.

కేసు వాయిదా.. 2 నెలల పాటు రుణగ్రహీతలకు ఊరట
లోన్ మారటోరియంకు సంబంధించి వాదనలు ఇంకా పూర్తి కానందున కేసును సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. బ్యాంకు సంఘాల తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, ఆర్బీఐ, కంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహదా వాదనలు వినిపించారు. రాబోయే రెండు నెలల కాలం పాటు ఏ ఖాతాలను ఎన్పీఏలుగా ప్రకటించవద్దని సుప్రీం కోర్టు బ్యాంకులను ఆదేశించింది. ఆగస్ట్ 31వ తేదీలోగా ఎన్పీఏ వర్గీకరణలోకి రాని ఖాతాలన్నింటికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులను అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చు.

వడ్డీని రద్దు చేయలేం
భారత ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం వెన్నెముక అని, ఆర్థిక వ్యవస్థ పురోగతిని పరిగణనలోకి తీసుకుంటే వడ్డీల మాఫీ ఏ మాత్రం సరికాదన్నది ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయ వైఖరి అని తుషార్ మెహతా నివేదించారు. కరోనా కారణంగా కొన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఫార్మా, ఐటీ వంటి రంగాలపై ప్రభావం సానుకూలంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేందుకు వడ్డీల రద్దు ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే అభిప్రాయం ఉందన్నారు. పైగా మారటోరియంను రెండేళ్ల పాటు పొడిగించే అవకాశముందన్నారు.

వడ్డీపై వడ్డీ మీద ఆందోళన
దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ... వడ్డీ మీద వడ్డీ వేయడం పైనే తాము ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. కాగా, మారటోరియం కాలంలో వాయిదా వేసిన ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేయడం ఆర్థిక మౌలిక సూత్రాలకు విరుద్ధమని, అలాగే నిజాయతీగా రుణవాయిదాలు చెల్లిస్తున్న వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని కేంద్రం ఇటీవలే సుప్రీం కోర్టుకు తెలిపింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications