పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి అనంతరం వరుసగా ఆరో రోజు మన దేశంలో ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర రూ.1.59 పైసలు, డీజిల్ ధర రూ.1.31 పైసలు పెరిగింది. 2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 22) ఢిల్లీ మార్కెట్లో పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 18 పైసలు పెరిగింది.

పెట్రోల్ ధరలు పెరిగాయి కానీ...
సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పెట్రోల్ ధరలు ప్రతి రోజు పెరుగుతున్నాయి. సౌదీలోని చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో 5 శాతం నష్టపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. మన దేశంలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ధరలు పెరిగినా అంతగా లేవు. కానీ ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత పెరుగుదల తప్పదా?
మరోవైపు, పెట్రోల్ డీజిల్ ధరలు మరో రూ.6 పెంచక తప్పదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరోవైపు, పెట్రో ఉత్పత్తులపై సుంకాల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడటం లేదని ప్రధాన్ చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా...
ఆదివారం హైదరాబాదులో పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి రూ.78.26కు, డీజిల్ ధర 23 పైసలు పెరిగి రూ.72.75కు చేరుకుంది. అమరావతిలో పెట్రోల్ 27 పైసలు పెరిగి రూ.77.94, డీజిల్ 22 పైసలు పెరిగి రూ.72.10కి పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర 28 పైసలు పెరిగి రూ.75.58, డీజిల్ ధర 22 పైసలు పెరిగి రూ.71.76గా ఉంది. దాదాపు అన్ని నగరాల్లోను అటు ఇటుగా ఇంతే పెరిగింది.

ఇతర నగరాల్లో...
ఢిల్లీలో పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి రూ.73.62గా, డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ.66.74గా, ముంబైలో పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి రూ.79.29గా, డీజిల్ ధర కూడా 22 పైసలు పెరిగి రూ.70.01గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.21 శాతం తగ్గుదలతో 63.20 డాలర్లగా, డబ్ల్యూఐటీ క్రూడాయిల్ 0.17 శాతం తగ్గి 58.09 డాలర్లుగా ఉంది.

శుభవార్త చెప్పిన ధర్మేంద్ర ప్రధాన్
ఓ వైపు అంతర్జాతీయస్థాయిలో చమురు విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్ని సమయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ శుభవార్త చెప్పారు. భారత్ ఫండింగ్ సహకారంతో నిర్మిస్తున్న మంగోలియాలోని ఆయిల్ రిఫైనరీ 2022 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. మంగోలియాలోని నాలుగింట మూడింట చమురు వసతుల్ని ఇది తీరుస్తుందన్నారు. 2015లో ప్రధాని మోడీ అక్కడ పర్యటించారని, ఇది భారత్ - మంగోలియా స్నేహాన్ని మరింతగా చాటి చెప్పిందని, భారత్ సహకారంతో 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 1 బిలియన్ డాలర్ల చమురు శుద్ధి కర్మాగారం నిర్మాణమే మన రెండు దేశాల మధ్య స్నేహం ప్రకాశవంతమవుతోందని చెప్పేందుకు ఉదాహరణ అన్నారు.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications