మ్యూచువల్ ఫండ్స్ స్కీం ల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు శుభవార్త. మీ కోసమే చాలా రోజుల తర్వాత కొత్త స్కీమ్స్ అందుబాదులోకి వచ్చియి. విభిన్నంగా ఉన్న ఈ స్కీం లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చు.

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్
స్కీం పేరు : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్
లక్ష్యం : ఇది ఫండ్ అఫ్ ఫండ్స్ స్కీం. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ లేదా ఈటీఎఫ్ (ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ లేదా ఇతర మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తున్న) యూనిట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిటర్న్ లను పెంచాలన్నది ఈ స్కీం ప్రాథమిక లక్ష్యం.
స్కీం రకం : ఓపెన్ ఎండెడ్
కేటగిరి : అదర్ స్కీం - ఎఫ్ ఓ ఎఫ్ డొమెస్టిక్
ఫండ్ ప్రారంభం : సెప్టెంబర్ 16 ముగింపు : 20వ తేదీ
* ఈ స్కీం లో ఎలాంటి ఎంట్రీ లోడ్ లేదు. యూనిట్ల అలాట్ మెంట్ నుంచి 12 నెలలవరకు ఎగ్జిట్ అయితే ఎన్ ఏ వీ పై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. 12 నెలల తర్వాత ఉండదు.
* ఈ స్కీం లో కనీస పెట్టుబడి రూ . 5,000

ఐటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
* దీన్ని ఐటీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకువచ్చింది. ఈక్విటీ, ఈక్విటీ సంభందిత సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్యాపిటల్ ను పెంచాలన్నది ఈ స్కీం ఉద్దేశం.
* ఈక్విటీ - ఈ ఎల్ ఎస్ ఎస్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
* ఈ కొత్త ఫండ్ ఆఫర్ జులై 15న ప్రారంభం కాగా అక్టోబర్ 14న ముగుస్తుంది.
* ఎంట్రీ లోడ్ , ఎగ్జిట్ లోడ్ లేదు.
* కనీస పెట్టుబడి రూ.500

ఎస్ బీ ఐ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియెంటెడ్ ఫండ్ - సీరీస్ ఏ (ప్లాన్ 6)
* ఎస్ బీ ఐ మ్యూచువల్ ఫండ్ దీన్ని తీసుకువచ్చింది. ఇది క్లోజ్ ఎండెడ్ క్యాపిటల్ ఓరియెంటెడ్ స్కీం. హై క్వాలిటీ ఫిక్స్డ్ ఇన్ కమ్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలన్నది ఈ స్కీం ప్రాథమిక లక్ష్యం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మూలధనాన్ని పెంచుకోవాలన్నది రెండో లక్ష్యం.
* ఆదాయం కేటగిరీలో వచ్చిన క్లోజ్ ఎండెడ్ స్కీం ఇది.
* ఈ నెల 12న ప్రారంభమైన ఈ స్కీం 26న ముగుస్తుంది.
* ఇందులో కనీస పెట్టుబడి రూ. 5,000

టాటా బ్యాంకింగ్ అండ్ పీఎస్ యు డెట్ ఫండ్
* ఈ స్కీం ను టాటా మ్యూచువల్ ఫండ్ తెచ్చింది.
* బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (పీ ఎస్ యు), పబ్లిక్ ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్స్ , మునిసిపల్ బాండ్శ్ జారీ చేసే డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రీజనేబుల్ ఆదాయాన్ని జనరేట్ చేయలన్నది ఈ స్కీం ఉద్దేశం.
* డెట్ స్కీం - బ్యాంకింగ్, పీ ఎస్ యు ఫండ్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
* ఈ నెల 19న ప్రారంభమైన ఈ షెమీ అక్టోబర్ 3న ముగుస్తుంది.
* ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications