గత ఆరేళ్లలో ఆర్థిక విస్తరణ చాలా బలహీనంగా ఉంది. కానీ భారత్లో విద్యుత్ డిమాండ్ మాత్రం దాదాపు 7 శాతం పెరిగింది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ప్రపంచ మార్కెట్తో పాటు భారత మార్కెట్ కూడా మందగమనంగా ఉంది. భారీ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాల్లో పవర్ అవసరాల పెరుగుదల ఏప్రిల్ - జూలై క్వార్టర్లో తగ్గింది. అదే సమయంలో డిమాండ్ ఎందుకు పెరిగిందంటే... మోడీ ప్రభుత్వం వచ్చాక పెద్ద సంఖ్యలో హౌస్ హోల్డ్స్కు విద్యుత్ కనెక్షన్లు దరి చేర్చారు. ఆయా రాష్ట్రాల్లోని గృహా విద్యుత్ వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది.

పరిశ్రమలకు పవర్ డిమాండ్ తగ్గుదల
ప్రభుత్వ సెంట్రల్ ఎలస్ట్రిసిటీ అథారిటీ డేటా ప్రకారం తమిళనాడు, మహారాష్డ్రలు ఆటోమొబైల్ మేకింగ్, విడిభాగాల తయారీ హబ్ రాష్ట్రాలు. ఇక్కడ పవర్ డిమాండ్ వరుసగా 2.7 శాతం, 1.4 శాతం పెరిగింది. లార్జ్ పవర్ కన్స్యూమర్స్లకు విద్యుత్ డిమాండ్ నెమ్మదించింది. హర్యానా, గుజరాత్లు తయారీ హబ్స్. ఇక్కడ విద్యుత్ అవసర డిమాండ్ గత ఏడాది కంటే తగ్గింది. హర్యానాలో 7.5 శాతం నుంచి 2.9 శాతానికి, గుజరాత్లో 8.8 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది.

ఆర్థిక మందగమనం
గత కొంతకాలంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆటో సేల్స్ భారీగా తగ్గాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కార్ల అమ్మకాలు తిరోగమనం పట్టడంతో వాహన తయారీదారులు ఉద్యోగులను తొలగించడంతో పాటు తాత్కాలికంగా కంపెనీలను మూసివేసే పరిస్థితులు వచ్చాయి. శుక్రవారం విడుదలైన డేటా ప్రకారం జీడీపీ 5 శాతంగా ఉంది. 2013 మార్చి తర్వాత తొలిసారి ఈ క్వార్టర్లో నెమ్మదించింది.

కంపెనీలకు విద్యుత్ డిమాండ్ పెరిగితే లాభం
కమర్షియల్ కంపెనీలు, ఫ్యాక్టరీలు వంటి వాటి నుంచి విద్యుత్కు డిమాండ్ పెరగడం.. ఇతర మార్గాల ద్వారా డబ్బును నష్టపోయే విద్యుత్ పంపిణీదారులకు ప్రయోజనం. ఇలాంటి వినియోగదారులు దాదాపు సగం వరకు ఉన్నాయి. వీరు ఎక్కువ మొత్తం చెల్లిస్తారు. ఇలా చెల్లించడం వల్ల పేదల ఇళ్లకు, రైతులకు సబ్సిడీ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.

రాష్ట్రాలపై భారం
ప్రతి ఇంటిని విద్యుదీకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అంతకుముందు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని దాదాపు నెరవేర్చారు. 2019లో ఆయన తిరిగి అద్భుత మెజార్టీతో గెలవడానికి ఈ హామీ కూడా ఓ కారణం. అయితే వాణిజ్య కంపెనీలు ఎక్కువ ఎలక్ట్రిసిటీని కొనుగోలు చేయకపోతే ఆ భారం రాష్ట్ర యుటిలీటీస్ పైన పడుతాయి. ప్యాక్టరీ డిమాండ్ తగ్గిందని చెప్పడానికి డీజిల్ డేటా కూడా చెబుతోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ ప్రకారం అంతకుముందు ఏడాది కంటే ఏప్రిల్ - జూలైలో 2.4 శాతం పెరిగింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధం.. ఎరువుల కొరతతో సంక్షోభంలోకి వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ మార్గాలు వైపు కేంద్రం అడుగులు..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications