గత ఆరేళ్లలో ఆర్థిక విస్తరణ చాలా బలహీనంగా ఉంది. కానీ భారత్లో విద్యుత్ డిమాండ్ మాత్రం దాదాపు 7 శాతం పెరిగింది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ప్రపంచ మార్కెట్తో పాటు భారత మార్కెట్ కూడా మందగమనంగా ఉంది. భారీ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాల్లో పవర్ అవసరాల పెరుగుదల ఏప్రిల్ - జూలై క్వార్టర్లో తగ్గింది. అదే సమయంలో డిమాండ్ ఎందుకు పెరిగిందంటే... మోడీ ప్రభుత్వం వచ్చాక పెద్ద సంఖ్యలో హౌస్ హోల్డ్స్కు విద్యుత్ కనెక్షన్లు దరి చేర్చారు. ఆయా రాష్ట్రాల్లోని గృహా విద్యుత్ వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది.

పరిశ్రమలకు పవర్ డిమాండ్ తగ్గుదల
ప్రభుత్వ సెంట్రల్ ఎలస్ట్రిసిటీ అథారిటీ డేటా ప్రకారం తమిళనాడు, మహారాష్డ్రలు ఆటోమొబైల్ మేకింగ్, విడిభాగాల తయారీ హబ్ రాష్ట్రాలు. ఇక్కడ పవర్ డిమాండ్ వరుసగా 2.7 శాతం, 1.4 శాతం పెరిగింది. లార్జ్ పవర్ కన్స్యూమర్స్లకు విద్యుత్ డిమాండ్ నెమ్మదించింది. హర్యానా, గుజరాత్లు తయారీ హబ్స్. ఇక్కడ విద్యుత్ అవసర డిమాండ్ గత ఏడాది కంటే తగ్గింది. హర్యానాలో 7.5 శాతం నుంచి 2.9 శాతానికి, గుజరాత్లో 8.8 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది.

ఆర్థిక మందగమనం
గత కొంతకాలంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆటో సేల్స్ భారీగా తగ్గాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కార్ల అమ్మకాలు తిరోగమనం పట్టడంతో వాహన తయారీదారులు ఉద్యోగులను తొలగించడంతో పాటు తాత్కాలికంగా కంపెనీలను మూసివేసే పరిస్థితులు వచ్చాయి. శుక్రవారం విడుదలైన డేటా ప్రకారం జీడీపీ 5 శాతంగా ఉంది. 2013 మార్చి తర్వాత తొలిసారి ఈ క్వార్టర్లో నెమ్మదించింది.

కంపెనీలకు విద్యుత్ డిమాండ్ పెరిగితే లాభం
కమర్షియల్ కంపెనీలు, ఫ్యాక్టరీలు వంటి వాటి నుంచి విద్యుత్కు డిమాండ్ పెరగడం.. ఇతర మార్గాల ద్వారా డబ్బును నష్టపోయే విద్యుత్ పంపిణీదారులకు ప్రయోజనం. ఇలాంటి వినియోగదారులు దాదాపు సగం వరకు ఉన్నాయి. వీరు ఎక్కువ మొత్తం చెల్లిస్తారు. ఇలా చెల్లించడం వల్ల పేదల ఇళ్లకు, రైతులకు సబ్సిడీ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.

రాష్ట్రాలపై భారం
ప్రతి ఇంటిని విద్యుదీకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అంతకుముందు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని దాదాపు నెరవేర్చారు. 2019లో ఆయన తిరిగి అద్భుత మెజార్టీతో గెలవడానికి ఈ హామీ కూడా ఓ కారణం. అయితే వాణిజ్య కంపెనీలు ఎక్కువ ఎలక్ట్రిసిటీని కొనుగోలు చేయకపోతే ఆ భారం రాష్ట్ర యుటిలీటీస్ పైన పడుతాయి. ప్యాక్టరీ డిమాండ్ తగ్గిందని చెప్పడానికి డీజిల్ డేటా కూడా చెబుతోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ ప్రకారం అంతకుముందు ఏడాది కంటే ఏప్రిల్ - జూలైలో 2.4 శాతం పెరిగింది.
More From GoodReturns

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications