For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో మార్కెట్లు, 769 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, నిఫ్టీ 225 లాస్

|

ముంబై: భారత మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.45 నిమిషాలకు సెన్సెక్స్ 375 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 100కు పైగా పాయింట్లు కోల్పోయింది. పదిగంటల సమయానికి సెన్సెక్స్ 313.27 (0.84%) నష్టపోయి 37,019.52 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 99.55 (0.90%) పాయింట్లు కోల్పోయి 10,923.70 వద్ద ట్రేడ్ అయింది.

సాయంత్రానికి మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సాయంత్రం 3.40 నిమిషాలకు సెన్సెక్స్ 769.88 (2.06%) పాయింట్లు కోల్పోయి 36,562.91 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా గం.3.32 నిమిషాలకు
225.35 (2.04%) కోల్పోయి 10,797.90 వద్ద ట్రేడ్ అయింది.

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఆటో ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోయాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇండియా వీఐఎక్స్ 8 శాతం లాభాల్లో ట్రేడ్ అయింది. ఐటీ షేర్లు మాత్రం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

Sensex dives over 350 points; Nifty below 10,900

శుక్రవారం పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు 2017 ఏడాది నుంచి 27 బ్యాంకుల నుంచి 12కు పడిపోయాయి. ఇటీవలి విలీనానికి ముందు 18 బ్యాంకులు ఉండగా, ఇప్పుడు పన్నెండుకు తగ్గాయి. బ్యాంకుల విలీనం నేపథ్యంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ నిర్ణయం బ్యాంకింగ్ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

English summary

భారీ నష్టాల్లో మార్కెట్లు, 769 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, నిఫ్టీ 225 లాస్ | Sensex dives over 769 points; Nifty below 10,900

The benchmark indices, the BSE Sensex and the NSE Nifty, traded in the red in the early session on Tuesday. The Sensex was at 36,961, down 371 points or 0.99 per cent lower, while the Nifty was trading at 10,910, down 112 points or 1.02 per cent weaker.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X