రుపీ షాక్: తొలిసారి డాలర్తో రూ.72కు దిగజారిన రూపాయి!
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం మధ్యాహ్నం సమయానికి ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రోజు రోజుకు దిగజారుతోంది. ఈ రోజు 72.01 వద్ద ట్రేడ్ అయింది. 2019 సంవత్సరంలో రూపాయి 72కు చేరుకోవడం ఇదే తొలిసారి. చైనా యువాన్ 11 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది.
ఏపీ నుంచి కియా 'మేడిన్ ఇండియా' కార్లు అదుర్స్: ధరలు
రూపాయి దిగజారడం తొలిసారి...
గురువారం నాటితో పోలిస్తే రూపాయి శుక్రవారం ఉదయం 15 పైసల తక్కువకు (71.97) ట్రేడ్ అయింది. ఆ తర్వాత 72కు దిగజారింది. 2019లో ఇలా తగ్గడం ఇదే మొదటిసారి. అదే సమయంలో ఒక నెలలో రూపాయి ఇంత దిగజారడం ఆరేళ్లలో ఇది తొలిసారి. ఈ ఒక్క ఆగస్ట్ నెలలోనే 4.60 శాతం నష్టపోయిన రూపాయి, 2019 ఆరంభం నుంచి చూస్తే మొత్తంగా 3.10 శాతం నష్టపోయింది.
రూ.71.80 నుంచి రూ.72.50 మధ్య క్లోజ్ అయ్యే ఛాన్స్
అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నష్టాలను చవి చూసిన అంతర్జాతీయ మార్కెట్లు, ఇటీవలే కోలుకుంటున్నాయి. భారత్ రూపాయితో పాటు చైనా యువాన్ కిందకు జారుతోంది. రూపాయి నష్టపోతుండటంతో సాఫ్టువేర్ రంగ షేర్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు రూపాయితో డాలర్ మారకం విలువ రూ.71.80 నుంచి రూ.72.50 మధ్య క్లోజ్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేశారు.
భారీ ఎఫ్పీఐలు వెనక్కి
గురువారం నాడు డాలర్తో రూపాయి మారకం విలువ రూపాయి 71.82 వద్ద క్లోజైంది. శుక్రవారం ఓ సమయంలో 71.51, 71.72 వద్దకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. 2018 డిసెంబర్ నుంచి రూపాయి ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా, ఫారన్ పోర్ట్పోలియో ఇన్వెస్టర్లు (FPI)లు గురువారం రూ.900 కోట్లను కేపిటల్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు.