డల్లాస్: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని, ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ పోర్టల్ సీఎం కార్యాలయానికి అనుసంధానం చేస్తామని, అందులో వచ్చే అప్లికేషన్స్ పరిష్కారం కోసం ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని భావించినా లేదా గ్రామాలను దత్తత తీసుకొని సాయం చేయాలనుకున్నా అందులో ప్రతిపాదిస్తే చాలని, అధికారులే మిమ్మల్ని సంప్రదించి, అవసరమైన సహకారం అందిస్తారన్నారు.

ఏడాదికి రెండుసార్లు రండి...
అమెరికాలోని ఎన్నారైలు ఏడాదికి ఒకటి రెండుసార్లైనా కుటుంబంతో సహా ఏపీకి రావాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అమెరికన్లను మించి ఎదుగుతున్న మిమ్మల్ని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ఏపీలో ప్రతి ఒక్కరికి ఇల్లు, మద్యపాన నిషేధం.. ఏపీని ఆనందరాష్ట్రంగా మార్చడం తన కల అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా ప్రభుత్వంపై రూ.3వేల కోట్ల భారం పడిందని, అందుకే ఆ ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

పెట్టుబడులకు ఇలా అవకాశాలు..
ఏపీకి 972 కిలో మీటర్ల సముద్ర తీరం ఉందని, నాలుగు ఓడ రేవులు, ఆరు ఎయిర్పోర్టులు ఉన్నాయని, రైలు మార్గం ఉందని జగన్ చెప్పారు. పెట్టుబడులతో ఏపీకి రావాలన్నారు. రానున్న అయిదేళ్లలో మరో ఐదు ఓడ రేవులు నిర్మిస్తామన్నారు. పెట్టుబడులకు సానుకూల వాతావరణం సృష్టిస్తున్నట్లు చెప్పారు. కరెంటును మన తక్కువ రేటుకు కొనుగోలు చేస్తే పరిశ్రమలకు కూడా తక్కువగే ఇవ్వగలుగుతామని, పారిశ్రామికవేత్తలను ఆకర్షించగలుగుతామన్నారు.

హైదరాబాద్ లాంటి నగరం లేదు..
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వంటి నగరం ఏపీకి లేకుండా పోయిందని, ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నారని, అందుకే రెండు నెలల్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని, 75 శాతం స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడా లేని విధంగా చట్టం తీసుకు వచ్చామని జగన్ చెప్పారు. ఎక్కడా అవినీతిలేకుండా పారదర్శకతతో ముందుకు సాగుతున్నామన్నారు. రూ.100 కోట్ల విలువ దాటే ఏ టెండర్ లేదా కాంట్రాక్ట్ అయినా ఓ జడ్జి దగ్గరకు పంపిస్తున్నామని, వారంలో వాటిని డొమైన్లో పెడతారన్నారు. ఎక్కడా లేనివిధంగా రివర్స్ టెండరింగ్ విధానా్నని తీసుకు వచ్చామన్నారు.

ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో భేటీ
మరోవైపు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ముఖ్యమంత్రి జగన్కు విందు ఇచ్చారు. ఏపీలో వ్యాపారాలు, పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications