స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గృహ రుణాలు తీసుకున్న వాళ్లందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.35 శాతం తగ్గించిన వెంటనే ఎస్బీఐ కూడా మొట్టమొదటగా వడ్డీ రేట్లలో కోత విధించింది. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకూ చేయని సాహసాన్ని చేసి ఎస్బీఐ పండుగలకు ముందే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
రెపో రేటును హౌసింగ్ లోన్కు జూన్ 2019లో లింక్ చేసిన ఘనత కూడా ఎస్బీఐ దక్కించుకుంది. దీన్ని బట్టి ఆర్బీఐ తన వడ్డీ రేట్లను సమీక్షించిన ప్రతీ సారీ .. వీళ్ల వడ్డీ రేట్లు కూడా ఎలాంటి ప్రత్యేక సమీక్షా లేకుండా మారిపోతాయి. ఇది చాలా మంచి ప్రయోజనం. ఎందుకంటే.. ఆర్బీఐ సమీక్ష తర్వాత బ్యాంకులు మళ్లీ వడ్డీ రేట్లను సమీక్షిస్తేనే కస్టమర్లకు ప్రయోజనం ఉంటుంది.

ఇక రోజు ఎస్బీఐ తగ్గించిన 35 బేసిస్ పాయింట్స్ తగ్గింపు నేపధ్యంలో ఎలాంటి ప్రయోజనం దక్కబోతోందో ఓ సారి చూద్దాం.
ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.25 లక్షల రుణాన్ని 20 ఏళ్లకు తీసుకున్నారని అనుకుందాం. దానికి ఎస్బీఐ ఇప్పటివరకూ వసూలు చేస్తున్న వడ్డీ 8.60 శాతం ఉందని లెక్కిద్దాం. ఈ లెక్కన అసలు రూ.25,00,000 + వడ్డీ రూ.27,44,977 అవుతుంది. దీనికి నెలనెలా ఈఎంఐ రూ.21854 అవుతుంది.
అదే తాజాగా మారిన వడ్డీ రేట్ల ప్రకారం అదే రూ.25 లక్షల మొత్తం, 20 ఏళ్ల సమయానికి 8.15 శాతం వడ్డీగా లెక్కిద్దాం. ఇప్పుడు అసలు రూ.25,00,000 + వడ్డీ 26,12,394 అవుతుంది. దీనికి నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.21302 అవుతుంది. అంటే నెలనెలా రూ.550 వరకూ తగ్గుతుంది.
ఓస్.. అంతేనే అనుకోవద్దు. ఎందుకంటే.. ఈ మొత్తం ఎఫెక్ట్ మీ చెల్లింపు కాలపరిమితి పూర్తయ్యేసరికి రూ.1,32,583 ఆదా అవుతుంది. అంటే.. ఆర్బీఐ చేసిన ఈ చిన్న మార్పు వల్ల మీ జేబుకు ఎంత ఆదా చేస్తోందో తెలిసి ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications