భారీగా పెరిగిన బంగారం ధర, వెండిదీ అదే దారి: కారణాలివే
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సోమవారం మరోసారి రికార్డ్ స్థాయికి చేరుకుంది. పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.33,970కు చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.260 పెరిగి రూ.41,960కు చేరుకుంది.
'నేడు (సోమవారం) బంగారం ధర 10 గ్రాముకు, రూ.9 35,970గా ఉంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర' అని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర జైన్ పేర్కొన్నారు. ఢిల్లీలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.100 పెరిగి రూ.35,970, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.100 పెరిగి రూ.35,800గా ఉంది.
సావరీన్ గోల్డ్ 8 గ్రాములకు రూ.100 పెరిగి రూ.27,500గా ఉంది. వెండి కిలోకు రూ.260 పెరిగి రూ.41,960గా ఉంది. బంగారం గత శుక్రవారం రూ.35,950 పలికింది. మరుసటి రోజు స్వల్పంగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన మద్దతుతో గడిచిన వారం రోజులుగా వెండి మరింత బలపడిందని, పసిడి రికార్డు స్థాయికి చేరుకుందని సురేంద్ర జైన్ తెలిపారు.
ఎయిరిండియాలో ప్రమోషన్లు, నియామకాలు నిలిపివేత
MCXలో బంగారు ఫ్యూచర్స్ గత వారం రికార్డు స్థాయిలో 35,409 డాలర్లను తాకిన తర్వాత 10 గ్రాములకి 0.40% పెరిగి 35,174 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్ బంగారు ఒప్పందాలు కూడా రూ. 35,750 కు పెరిగాయి. సెప్టెంబర్ కాంట్రాక్టులు 1.5% పెరిగి 41,317 డాలర్లకు చేరుకోవడంతో బంగారం, వెండి ధరలు కూడా కఠితరంగా మారాయి.
ఈక్విటీ మార్కెట్ల పతనంతో పాటు పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని విలువైన లోహాలవైపు మళ్లిస్తున్నారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్తో సహా ప్రధాన ప్రపంచ కేంద్ర బ్యాంకుల నుండి ద్రవ్య విధాన ఉద్దీపన అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,425.60 డాలర్ల వద్ద ఉండగా, వెండి 16.40 డాలర్లగా ఉంది.