ముంబై : పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ విక్రయంలో మరో అడుగు ముందుకుపడింది. సంస్థ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్ గ్రూప్ ఎస్బీఐతో భేటీ అయింది. జెట్ ఎయిర్వేస్ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు ఆ కంపెనీ రూ.14వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని డార్విన్ గ్రూప్ సీఈఓ రాహుల్ గన్పులే ప్రకటించారు.

బిడ్ దాఖలు చేసిన డార్విన్ గ్రూప్
డార్విన్ గ్రూపు ఇప్పటికే ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, రియల్టీ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ కొనుగోలు కోసం ఫైనాన్షియల్ బిడ్ దాఖలుకు సిద్ధమైంది. అయితే ఫైనాన్షియల్ బిడ్ సమర్పించే ముందు మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్బీఐ క్యాప్తో భేటీ అయినట్లు కంపెనీ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా జెట్ ఎయిర్వేస్ అప్పులన్నీ చెల్లిస్తామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపింది.

విక్రయానికి 75శాతం వాటా
జెట్ ఎయిర్వేస్కు ఎస్బీఐ కన్సార్టియం 8వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వగా.. తిరిగి చెల్లించకపోవడంతో వాటిని ఈ క్విటీగా మార్చుకుంది. అనంతరం జెట్ ఎయిర్వేస్లో 75శాతం వాటాను ఎస్బీఐ క్యాప్స్ ద్వారా అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం కలిగిన ఎతిహాద్తో పాటు మరో రెండు కంపెనీల నుంచి బిడ్లు రాగా.. కొనుగోలు కోసం ఎతిహాద్ పలు షరతులు విధించింది.

ఏవియేషన్పై హిందుజాల ఆసక్తి?
దాదాపు పది రంగాల్లో వ్యాపారం కలిసిన హిందూజాలు ఏవియేషన్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు గతంలో ఆసక్తి చూపింది. 2001లో ఎయిరిండియాలో 40శాతం వాటా విక్రయించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు హిందూజా గ్రూపు బిడ్ దాఖలు చేసింది. ఇండియన్ ఎయిర్లైన్స్లోనూ 26శాతం వాటా కొనుగోలు కోసం అశోక్ లేలాండ్, హిందూజా ఫైనాన్స్ కార్పొరేషన్తో పాటు మాకెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిడ్లు వేశాయి. ఇటీవల ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా హిందూజా గ్రూప్ ఆసక్తి కనబరిచింది.

హిందుజాలను ఒప్పించే ప్రయత్నం
జెట్ ఎయిర్వేస్ రుణ దాతలతో పాటు ఎతిహాద్ సంస్థ హిందూజా గ్రూపును సంప్రదించినట్లు సమాచారం. జెట్ ఎయిర్వేస్లో పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీని కోరినట్లు తెలుస్తోంది. తొలుత హిందుజా గ్రూపు వ్యవహారాలు చూసే జేపీ హిందుజాను సంప్రదించగా... తమ్ముడు అశోక్ హిందూజాను సంప్రదించిమని సూచించారు. అయితే ఇద్దరు సోదరులు జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

వాటా విక్రయాల ప్రయత్నం
జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. దీంతో కంపెనీలో 75 శాతం వాటాను విక్రయించేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు నాలుగు సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లుదాఖలు చేయగా.. వాటిలో డార్విన్ గ్రూప్ లేదు. అయితే ఫైనాన్షియల్ బిడ్ల దాఖలుకు గడువైన ఈ నెల 10న ఎతిహాద్ ఎయిర్వేస్తో పాటు కొన్ని కొత్త సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. 13న వాటిని పరిశీలించిన బ్యాంకర్లు డార్విన్ గ్రూప్ సీఈఓతో భేటీ అయ్యారు. ఈ సమావేశంతో ఆయన జెట్ కొనుగోలుకు రూ.14వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications