ఈ బ్యాంకులో 1998లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 34 రెట్లు పెరుగుతుంది
ఇండస్ఇండ్ బ్యాంక్ 1994లో ఎస్టాబ్లిష్ అయింది. ప్రస్తుతం ఇది సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. ఈ బ్యాంకులో 20 ఏళ్ల క్రితం అంటే 1998లో రూ.100 పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసా? అక్షరాలు రూ.3,410. ఇది చిన్న మొత్తంగా కనిపించవచ్చు. కానీ రూ.1000, రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి పెద్ద మొత్తంలో వస్తాయి. ఈ 20 ఏళ్లలో ఈ బ్యాంకు షేర్ విలువ ఏకంగా 34 రెట్లకు పైగా పెరిగింది.
రైల్వే ప్రయాణీకులకు 'సమ్మర్' రిలీఫ్
ఇండస్ఇండ్ బ్యాంక్ రూ.100 కోట్ల కేపిటల్ మొత్తంతో ప్రారంభించారు. ఇందులో రూ.60 కోట్లను ఇండియాలోని వారి నుంచి సేకరించగా, రూ.40 కోట్లు ఎన్నారైల నుంచి సేకరించారు. దీనిని ప్రధానంగా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ గ్రూప్ ప్రమోట్ చేసింది. ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.180 కోట్లు సేకరించింది.
ఇండస్ఇండ్ బ్యాంక్ లోన్ బుక్ గ్రోత్ రేటు 28 శాతం (సీఏజీఆర్) వద్ద రూ.1.73 కోట్లుగా ఉంది. 31 డిసెంబర్ 2018 ఈ బ్యాంకుకు 1,558 బ్రాంచీలు, 2,453 ఏటీఎంలు ఉన్నాయి. డిసెంబర్ క్వార్టర్ ఇయర్లో ఇండస్ఇండ్ బ్యాంక్ 985.03 కోట్లతో 5.21శాతం పెరిగింది. ఈ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో రోమెష్ సోబ్తీ. అతని టర్మ్ మార్చి 2020 నాటికి ముగియనుంది.