మళ్లీ సరికొత్త రికార్డులను నమోదు చేసిన సూచీలు
బీఎస్ఈ సెన్సెక్స్ 251 పాయింట్ల లాభంతో 34,843 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 60.30పాయింట్ల లాభంతో 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 34,687.21- 34,963.69 పాయింట్ల రేంజ్లో కదలాడింది.
సంక్రాంతి పండగ పర్వాన స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. ప్రధానంగా ఆర్థిక సేవలు, మీడియా, నిఫ్టీ బ్యాంక్, ప్రవేట్ బ్యాంక్ షేర్లలో ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులతో నేటి ట్రేడింగ్ ఆద్యంతం సూచీలు లాభాల ర్యాలీ చేశాయి. ఈ నేపథ్యంలోనే సూచీలు సోమవారం మరోసారి నూతన జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 251 పాయింట్ల లాభంతో 34,843 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 60.30పాయింట్ల లాభంతో 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 34,687.21- 34,963.69 పాయింట్ల రేంజ్లో కదలాడింది. నిఫ్టీ సూచీ 10,713.80-10,782.65 శ్రేణిలో కదలాడింది. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ పాయింట్ల 26,091.80 వద్ద కొత్త రికార్డును నెలకొల్పి 20,069 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ దాదాపు 6 శాతం దూసుకెళ్లగా, ఐసీఐసీఐ, అంబుజా, జీ, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్గ్రిడ్, యాక్సిస్ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐషర్, గెయిల్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, హీరోమోటో, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, టీసీఎస్, యస్బ్యాంక్, ఎంఅండ్ఎం 2.5-1.2 శాతం తిరోగమించాయి. బీఎస్ఈలో 1,525 షేర్లు లాభపడితే 1412 డీలాపడ్డాయ్.