For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివ‌ర్లో అమ్మ‌కాల ఒత్తిడితో న‌ష్టాల్లో మార్కెట్లు

వరుసగా మూడో రోజు కన్సాలిడేషన్‌ బాటలోనే సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 33,793 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 1 పాయింట్‌ బలపడి 10,443

|

వరుసగా మూడో రోజు కన్సాలిడేషన్‌ బాటలోనే సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 33,793 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 1 పాయింట్‌ బలపడి 10,443 వద్ద స్థిరపడింది. అయితే రోజు మొత్తం మార్కెట్లు సానుకూలంగానే కదలడం గమనించదగ్గ అంశం. మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడగా.. నాస్‌డాక్‌ తొలిసారి 7,000 పాయింట్ల ఎగువన స్థిరపడింది.

మార్కెట్లు

బీఎస్ఈ సూచీలో వాహ‌న రంగం త‌ప్ప అన్నీ సానుకూలంగా సాగాయి. అందులో లోహ రంగం(1.47%), క్యాపిట‌ల్ గూడ్స్‌(1.22%), స్థిరాస్తి(1.21%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్(0.98%), ఆటో(0.26%) లాభ‌ప‌డ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో అదానీ పోర్ట్స్ (2.78 శాతం), ఎల్ అండ్ టీ (2.17 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (+ 1.88 శాతం), యస్ బ్యాంక్ (+ 1.33 శాతం), కోల్ ఇండియా (+ 0.72) లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు రెడ్డీస్ (-2.97%), విప్రో (-2.73%), ఒఎన్జిసి (-1.65%), బజాజ్ ఆటో (-1.61%), మారుతీ (-1.35%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

English summary

చివ‌ర్లో అమ్మ‌కాల ఒత్తిడితో న‌ష్టాల్లో మార్కెట్లు | markets ended with slight losses in today trading

A selloff in the last hour of trade led to benchmark indices giving up all their gains and ending on a flat note, with the Nifty closing below 10,450-mark.
Story first published: Wednesday, January 3, 2018, 17:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X