నెల రోజుల కనిష్టానికి స్టాక్ మార్కెట్లు
వరుసగా మూడో రోజు ఊపందుకున్న అమ్మకాల కారణంగా మార్కెట్లు నెల రోజుల కనిష్టం వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 181 పాయింట్లు కోల్పోయి 32,760 వద్ద నిలిచింది.
వరుసగా మూడో రోజు ఊపందుకున్న అమ్మకాల కారణంగా మార్కెట్లు నెల రోజుల కనిష్టం వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 181 పాయింట్లు కోల్పోయి 32,760 వద్ద నిలిచింది. ఒక దశలో 225 పాయింట్ల వరకూ పతనమైంది. నిఫ్టీ సైతం 69 పాయింట్లు క్షీణించి 10,118 వద్ద స్థిరపడింది. తొలుత 10,100 దిగువన 10,094 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
ఈ రోజు ట్రేడింగ్లో బీఎస్ఈ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. హీరో మోటో కార్ప్(0.72%), ఐసీఐసీఐ బ్యాంక్(0.54%), టాటా పవర్ (0.37%), ఇన్ఫోసిస్ (0.26%) లాభపడిన వాటిలో ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో వేదాంత లిమిటెడ్(4.61%), సన్ ఫార్మా(4.01%), హిందాల్కో(3.45%), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-బీహెచ్ఈఎల్(3.02%), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(2.55%) వంటివి ముందున్నాయి.