33 వేలకు దిగువన సెన్సెక్స్
అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టంగా నమోదు కావడంతో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సరికి నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ చివరికి 91.69 పాయింట్ల నష్టంలో 32,941 వద్ద ముగిసి
ద్రవ్యోల్బణం కారణంతో మార్కెట్లు దిగువకు...
అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టంగా నమోదు కావడంతో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సరికి నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ చివరికి 91.69 పాయింట్ల నష్టంలో 32,941 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 38.35 పాయింట్ల నష్టంలో 10,186 వద్ద ముగిసింది. కాగా డాలర్తో రూపాయి మారకం విలువ రూ.65.43గా ఉంది.
బీఎస్ఈ సూచీలో స్థిరాస్తి(0.72%), ఆటో(0.32%), వినియోగదారు వస్తువులు(0.15%), ఇంధన రంగం షేర్లు లాభపడగా, టెలికాం, లోహ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు నష్టాలతో ముగిశాయి.

ఈ రోజు ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. నష్టపోయిన వాటిలో ఎల్ అండ్ టీ(2.46%), వేదాంత లిమిటెడ్(1.64%), టీసీఎస్(1.53%), ఓఎన్జీసీ(1.25%), సన్ ఫార్మా(1.19%), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్(0.99%) ముందున్నాయి. మరో వైపు లాభపడిన వాటిలో హీరో మోటోకార్ప్(1.96%), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(1.62%), యాక్సిస్ బ్యాంక్(1.57%), బజాజ్ ఆటో లిమిటెడ్(1.37%), మహీంద్రా అండ్ మహీంద్రా(1.34%), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(1.26%) ముందున్నాయి.
Telugu.goodreturns.in


Click it and Unblock the Notifications