సుమారు రూ. 50,000 దాకా సొమ్మును డిజిటల్ వాలెట్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు, లిక్విడ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఆన్లైన్ మాధ్యమ
నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులకు వాలెట్లను వాడేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అదే విధంగా యువతరానికి పెట్టుబడి సాధనాలను మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా సుమారు రూ. 50,000 దాకా సొమ్మును డిజిటల్ వాలెట్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు కల్పించింది.

మరోవైపు, లిక్విడ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఆన్లైన్ మాధ్యమంలో తక్షణ ఉపసంహరణ వెసులుబాటు కల్పించాలంటూ మ్యూచువల్ ఫండ్ సంస్థలను సెబీ ఆదేశించింది. విత్డ్రాయల్ పరిమితి రూ. 50,000 లేదా ఫోలియో విలువలో 90 శాతంగా (ఏది తక్కువైతే అది) ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చేందుకు, కుటుంబాల పొదుపు మొత్తాలను క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ వాలెట్స్ ద్వారా మదుపర్లు.. ఫండ్ స్కీములో రూ.50,000 దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని, అంతకు మించకుండా చూడాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సెబీ సూచించింది. పెట్టుబడుల ఉపసంహరించుకున్న పక్షంలో వచ్చే మొత్తాన్ని యూనిట్ హోల్డరు బ్యాంకు ఖాతాకు మాత్రమే బదిలీ చేయాలని పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ తెలిపింది. ఇలా తమ ద్వారా ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ-వాలెట్ సంస్థలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ క్యాష్ బ్యాక్ వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి లేదని స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications