బ్యాంకుల బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ
దీంతో ఆగ్రహించిన ఆర్బీఐ కన్సైన్మెంట్ బేసిస్పై బ్యాంకులు దిగుమతి చేసుకునే పసిడిని పరిమితి చేసింది. బంగారం దిగుమతులపై ఇప్పటికే ఉన్న నిబంధలను మరింత కఠినం చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. బంగారంపై ఆర్ బీఐ ఏర్పాటు చేసిన కమిటి తీసుకున్న సిఫార్సులను అమలుచేస్తూ బంగారం దిగుమతిపై ఆంక్షలను ప్రవేశపెట్టింది. ఐతే బంగారు ఆభరణాల ఎగుమతిదారులను ప్రొత్సహించేందుకుగాను బ్యాంకులు అందించే సాయంపై ఆంక్షలను మాత్రం విధించ లేదు. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు రికార్డు స్థాయిలో 6.7 శాతం పెరిగిన విషయం తెలిసిందే.
కరెంట్ ఖాతా లోటును వేగంగా పెంచుతున్న బంగారం, వెండి వంటి ఖరీదైన వాటి దిగుమతులతో ఇన్నాళ్లూ ద్రవ్యోల్బణం తగ్గించే లక్ష్యంతో ద్రవ్యవిధాన సమీక్షలు జరుపుతున్న ఆర్బిఐ ఇప్పుడు కరెంట్ ఖాతా లోటును తగ్గించే లక్ష్యంతో సమీక్షలు చేయాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చిలో నికరంగా రూ. 4,510 కోట్ల విలువైన బంగారాన్ని స్పాట్ ఫారెక్స్ మార్కెట్లో కొనుగోలు చేసింది.
వన్ఇండియా మనీ తెలుగు