కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ ఈఎంఐ మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ను మూడోసారి మే 17వ తేదీ వరకు పొడిగించారు. మరోవైపు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షలు సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలు మెల్లిగా ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మారటోరియంను ఎవరు, ఏ మేరకు ఉపయోగించుకోవచ్చో చూద్దాం.

భవిష్యత్తులో భారం
కరోనా మహమ్మారి కారణంగా వేతనాల కోత, ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయాలు తగ్గిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈఎంఐల చెల్లింపు వాయిదా వేయడం ఊరటగానే చెప్పాలి. అయితే మారటోరియం ఉపయోగించుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఆర్థిక ఒత్తిడి మాత్రమే తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో ఇది భారంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే దీనిని ఉపయోగించుకోవడం బెట్టర్.

తాత్కాలిక ఊరట.. భవిష్యత్తు భారం
మూడు నెలల మారటోరియం అని చెప్పినప్పటికీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. మూడు నెలల వాయిదాలకు సంబంధించి వడ్డీని, అప్పటి వరకు ఉన్న అసలు రుణంలో కలిపేస్తాయి బ్యాంకులు. దీని వల్ల అసలు మొత్తం పెరగడంతో పాటు మీరు చెల్లించే మొత్తం పెరుగుతుంది. ఇది ఈఎంఐ రూపంలో పెరగవచ్చు లేదా కాల పరిమితిలో పెరగవచ్చు.

ఎవరెవరికి ఈఎంఐ వర్తిస్తుంది
అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హోమ్ లోన్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన టర్మ్, వ్యవసాయ రుణాలకు ఈ మారటోరియం వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, కార్డు రుణాల ఈఎంఐలకు ఉపయోగించుకోవచ్చు. ఓ బ్యాంకులో హోమ్ లోన్, మరో బ్యాంకులో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఉన్నా అన్నింటికి వెసులుబాటు ఉంది.

మరో మూడు నెలలు ఉపయోగించుకుంటే షాక్
ఇప్పటికే ఆర్బీఐ కరోనా కారణంగా మూడు నెలలు మారటోరియం విధించింది. మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిని ఉపయోగించుకుంటే దీర్ఘకాలంలో కొంత భారమే. ఉదాహరణకు మూడు నెలల మారటోరియం ఉంటేనే లోన్ చివరి సమయంలో ఉంటే ఒక నెల రుణభారం పెరుగుతుంది. అదే ప్రారంభంలో అయితే పన్నెండు పదమూడు కిస్తీలు పెరుగుతాయని గతంలోనే అంచనా వేశారు. ఇప్పుడు మొత్తం ఆరు నెలలు ఉపయోగించుకుంటే ఆ భారం మరింత పెరుగుతుంది. ఆరు నెలలు ఉపయోగించుకుంటే ప్రస్తుతం భారం తప్పవచ్చు. కానీ రుణ చెల్లింపు వ్యవధి దాదాపు 24 నెలల వరకు కూడా పెరుగుతుందని నిపుణుల అంచనా.

రెపో రేటు లింక్డ్
తప్పనిసరి అయితే తప్ప దీనిని ఉపయోగించుకోవద్దనేది నిపుణుల మాట. ఇప్పుడు మారటోరియం ఉపయోగించుకున్న తర్వాత.. ఆ తర్వాత పెరిగే మొత్తానికి ఈఎంఐ పెంచుకోవాలా, వ్యవధి పెంచాలా అనేది మీ ఇష్టం.బ్యాంకులు ఎక్కువగా రెపో రేటు ఆదారిత వడ్డీ రేటును ప్రామాణికంగా తీసుకొని, కొంత శాతం అధికంగా వసూలు చేస్తాయి. కాబట్టి బ్యాంకులు, హోమ్ లోన్ సంస్థల దగ్గర నుండి తీసుకున్న హోమ్ లోన్స్కు సంబంధించి ఎంసీఎల్ఆర్ ఉంటే దానిని రెపో రేటుకు మార్చుకోవడం మంచిది. అలా మార్చుకుంటే బ్యాంకులు కొంత ఛార్జ్ వసూలు చేస్తాయి.
More From GoodReturns

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..



Click it and Unblock the Notifications