లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ) నుంచి మరో సరికొత్త పాలసీ వచ్చింది. ఇటీవల చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832ను లాంచ్ చేసింది. ఇందులో మీరు రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే పాలసీ మెచ్యూరిటీ నాటికి రూ.27 లక్షలు అందుకుంటారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇది మంచి ప్లాన్గా చాలామంది పేరెంట్స్ భావిస్తున్నారు. ఓ వైపు చదువులు, ఆరోగ్యం, జీవనోపాధి కోసం కుటుంబాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి. వీటితో పాటు పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించాల్సి వస్తోంది. ఎల్ఐసీ తీసుకువచ్చిన ఈ పాలసీ మీకు ఉపశమనం కలిగించవచ్చు. మీరు రోజుకు రూ.206 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.

చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832 పాలసీ మెచ్యూరిటీ 25 ఏళ్లు
చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832 పాలసీ మెచ్యూరిటీ 25 ఏళ్లు. మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చిన తర్వాతే పాలసీ గడువు ముగుస్తుంది. పిల్లల వయస్సును బట్టి మెచ్యూరిటీ మారుతుంది. ఉదాహరణకు మీ పిల్లలు పన్నెండేళ్లు ఉంటే.. మెచ్యూరిటీ 13 ఏళ్లుగా ఉంటుంది. అంటే అప్పటికి 25 ఏళ్లు అవుతాయి. ఒకవేళ మీ పిల్లలు అయిదేళ్లు ఉంటే 20 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది. రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత రూ.27 లక్షలు పొందవచ్చు.

రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే 25 ఏళ్ల తర్వాత 27 లక్షలు
ఈ పాలసీ తీసుకుంటే మీరు రోజుకు రూ.206 ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. మీ పిల్లల వయస్సు 0 నుంచి 12 ఏళ్లు ఉండాలి. రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే 25 ఏళ్ల తర్వాత 27 లక్షలు వస్తాయి. నిబంధనల ప్రకారం
తల్లిదండ్రులు వీటిని పిల్లల విద్య, భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవచ్చు.

ప్రీమియంలు ఇలా
చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832 పాలసీలో వివిధ రకాల ప్రీమియంలు ఉన్నాయి. పాలసీ హోల్డర్లు ఆరు నెలలు, మూడు నెలలు, ఒక నెల లేదా ఒక ఏడాదికి ఓసారి చెల్లించవచ్చు. కనీసం రూ.లక్ష మినిమం పాలసీ. గరిష్ట పరిమితి లేదు. ఏడాది పేమెంట్ ఆప్షన్ రూ.77,334, 6 నెలల పేమెంట్ ఆప్షన్ 39,086, 3 నెలల పేమెంట్ ఆప్షన్ 19,750, నెల పేమెంట్ ఆప్షన్ 6,584గా ఉంది. అయితే పైన పేర్కొన్న అమౌంట్ పాలసీ తొలి ఏడాదికి సంబంధించినవి. పాలసీదారు 12 వరుస ప్రీమియంలు చెల్లించవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications