న్యూఢిల్లీ: మీరు మొబైల్ ఫోన్ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. కంపెనీ ఎండీయే ఆ ఫోన్ను మీ వద్దకు వచ్చి డెలీవరీ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది! ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ సంస్థ కొత్త డివైస్ తీసుకు వచ్చినప్పుడల్లా వైస్ ప్రెసిడెంట్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ దీనిని స్వయంగా కొందరు కస్టమర్లకు డెలివరీ చేస్తారు. తాజాగా, షియోమీ ఇండియా కంపెనీ ఎండీ మరోసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. యుగందర్ రెడ్డి అనే కస్టమర్ కమ్ అభిమానికి స్వయంగా ఫోన్ డెలివరీ చేశారు. ఈ విషయమై షియోమీ ఎండీ మను కుమార్ జైన్ స్పందించారు.
కొత్త ఫోన్లను విడుదల చేసిన ప్రతిసారి కొన్ని ఫోన్లను తాను స్వయంగా వెళ్లి కస్టమర్లకు అందిస్తానని, ఈ సందర్భంగా వారి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం నాకు ఇష్టమని చెప్పారు. షియోమీ అభిమానుల కుటుంబాన్ని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

కొద్ది రోజుల క్రితం యుగందర్ రెడ్డి రెడ్ మీ నోట్ 8ప్రో ఫోన్ను ఆర్డర్ చేశారు. ఆయన ఇప్పటికే పలు ఎంఐ ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. Redmi Note 8 Pro ఆయన మరో షియోమీ ఫోన్. అంతకుముందు POCO F1 ఉపయోగించారు. ఆయన సతీమణి Redmi Note 7 Pro వినియోగిస్తున్నారు. Mi A3 అతని తల్లి ఉపయోగిస్తున్నారు. Redmi Note 8 Pro అతని తండ్రి వినియోగిస్తున్నారు.
ఆన్ లైన్ ద్వారా షియోమో సేల్స్ పెద్ద ఎత్తున ఉంటాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి పోర్టల్స్తో పాటు సొంత పోర్టల్ ఎంఐ డాట్ కామ్ కూడా విక్రయిస్తోంది. 2020 ఏడాది మిడిల్ నాటికి భారత్లో 10వేల వరకు స్టోర్స్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఆరువేల స్టోర్స్ ఉన్నాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications