LIC News: ఎల్ఐసీ అనే పేరు వినపడగానే మనందరికీ గుర్తొచ్చేది నమ్మకం. ఆ నమ్మకంతోనే చాలా మంది చిన్న రిటైల్ పెట్టుబడిదారులు ఆ కంపెనీ ఐపీవోలో తమ పెట్టుబడులను పెట్టారు. కానీ.. ఆ తర్వాతే కథ మెుత్తం మారిపోయింది. ఏమైందో తెలియదు కానీ కంపెనీ సంపద కాలం గడిచే కొద్దీ క్షీణించటం మెుదలైంది. అయితే దీనిని సమర్ధవంతంగా సరిదిద్ధేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది. ఇది ఇన్వెస్టర్లను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం.

కొత్త నాయకత్వం..
ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఒక రథసారధిని నియమించాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటి వరకు బీమా దిగ్గజానికి ఛైర్మన్ నాయకత్వం వహించేవారు. అయితే ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న వ్యక్తి పదవీకాలం మార్చిలో ముగియనుంది. ఆ తర్వాత ఈ పదవిని రద్దు చేసి ప్రైవేటు రంగం నుంచి ఒక నిపుణుడిని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇద్దరు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ పగ్గాలు ప్రైవేటు వ్యక్తి చేతికి వెళతాయి.

చరిత్రలో తొలిసారిగా..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెుత్తం రూ.41 లక్షల కోట్లుగా ఉంది. ఈ తరుణంలో సంస్థ 66 ఏళ్ల చరిత్రలో మెుదటిసారిగా సంస్థకు నాయకత్వం వహించడానికి ఒక ప్రైవేటు రంగంలోని వ్యక్తిని ప్రభుత్వం నియమించటం సంచలనంగా మారింది. ఈ నియామకం వల్ల కంపెనీ భవిష్యత్తు వృద్ధి వేగాన్ని అందుకుంటుందా అనే విషయం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. ఎందుకంటే ఎల్ఐసీ అనేది కేవలం పేరు కాదు కోట్ల మంది ప్రజల నమ్మకం కావటం ఇక్కడ కీలకం. అయితే ఈ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖను వివరణ కోరగా ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది.

చట్టాల్లో మార్పులు..
ప్రభుత్వ రంగంలోని కంపెనీని నడిపించేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ని ప్రభుత్వం నియమింటానికి చట్టపరమైన చిక్కులు ఉంటాయి. దీనికి అనుగుణంగా గత ఏడాది ఎల్ఐసీని నియంత్రించే చట్టంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన మార్పులు చేసింది. అయితే ఇది ఇన్వెస్టర్లకు, ఇతర వాటాదారులకు మంచి సంకేతాలను పంపుతోందని అధికారులు అంటున్నారు. కొత్తగా నియమించబడే వ్యక్తి ఏ రంగానికి చెందినవారనే వివరాలను ప్రస్తుతానికి అధికారులు వెల్లడించలేదు.

ఐపీవో తర్వాత..
మే నెలలో ఎల్ఐసీ ఐపీవో మార్కెట్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి ఇష్యూ ధర కంటే స్టాక్ దాదాపు 30 శాతం తక్కువ ధరకు ట్రేడ్ అవుతోంది. దీని కారణంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా రూ.2 లక్షల కోట్ల వరకు తుడిచిపెట్టుకుపోయింది. ప్రైవేటు రంగంలోని చాలా బీమా కంపెనీల షేర్లు ఎల్ఐసీ కంటే మంచి పనితీరు కనబరచటం చాలా మంది ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే కంపెనీ పనితీరు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ, సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications