For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లు సరికొత్త రికార్డు, అందుకే సూచీలు జంప్: IRCTC, రిలయన్స్ జంప్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 7) భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు సరికొత్త గరిష్టాన్ని తాకాయి. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కిందకు పడిపోలేదు. మధ్యాహ్నం సెషన్ వరకు 45,200 స్థాయిలో ట్రేడ్ అయిన సెన్సెక్స్, 12 గంటల తర్వాత 45,300 స్థాయికి చేరుకొన్నాయి. ఆ తర్వాత 45,200 కిందకు పడిపోలేదు. ఓ సమయంలో 44,450 సమీపానికి చేరుకొని, చివరకు 350 పాయింట్ల లాభంతో ముగిసింది. ఫైనాన్షియల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి.

HDFC, SBI కస్టమర్లకు ఇబ్బందులపై RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలుHDFC, SBI కస్టమర్లకు ఇబ్బందులపై RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు

సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులు

సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులు

నేడు సెన్సెక్స్ 347.42 పాయింట్లు(0.77%) లాభపడి 45,426.97 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97.30 పాయింట్లు(0.73%) ఎగిసి 13,355.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1972 షేర్లు లాభాల్లో, 936 షేర్లు నష్టాల్లో ముగియగా, 190 షేర్లలో ఎలాంటి మార్పులేదు.ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్ స్టాక్స్ అండతో నిఫ్టీ 13,350 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ మీడియా కూడా లాభపడింది. జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ స్టాక్స్ ఎగిశాయి.

నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు ఒక్కో శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మీడియా స్టాక్స్ ర్యాలీ చేశాయి. రియాల్టీ నష్టాల్లో ముగిసింది.

IRCTC, రిలయన్స్ జంప్

IRCTC, రిలయన్స్ జంప్

నిఫ్టీ వరుసగా లాభాల్లో కొనసాగుతోంది. IRCTC స్టాక్ జంప్ కావడంతో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 7వ రోజు లాభపడింది. నిఫ్టీ మీడియా 7వ రోజు మంచి లాభాలు నమోదు చేసింది. నిఫ్టీ PSU బ్యాంకులు 3వ రోజు లాభపడింది. ఎంటీడీ స్టాక్స్ 10 శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ 4వ రోజు పెరిగింది. ఫార్మా 1 శాతం ఎగిసింది.

రంగాలవారీగా నిఫ్టీ ఆటో 0.10 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.53 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.44 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.52 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.58 శాతం, నిఫ్టీ ఐటీ 0.59 శాతం, నిఫ్టీ మీడియా 2.79 శాతం, నిఫ్టీ ఫార్మా 1.64 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.12 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.45 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియాల్టీ 0.34 శాతం నష్టపోయాయి.

IRCTC నేడు దాదాపు 7 శాతం ఎగిసి రూ.1678, రిలయన్స్ షేర్ ధర 0.60 శాతం రూ.1958.35 డాలర్ల వద్ద ముగిసింది.

అందుకే సూచీలు జంప్

అందుకే సూచీలు జంప్

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లు నష్టపోయాయి. అయితే వ్యాక్సీన్ అందుబాటులోకి రానుందనే వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. FDIలు కూడా రికార్డుస్థాయిలో ఉన్నాయి. కరోనా కేసులు దేశంలో తగ్గడం, రికవరీలు పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయనే అంచనాల నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. దీనికి తోడు ఫైనాన్షియల్, బ్యాంకింగ్ స్టాక్స్ ఎగిశాయి.

English summary

మార్కెట్లు సరికొత్త రికార్డు, అందుకే సూచీలు జంప్: IRCTC, రిలయన్స్ జంప్ | Stock Markets Today: Sensex ends 347 points higher, Nifty tops 13,350

The domestic stock market began the week on a strong note as the benchmark indices gained over 0.7 per cent each, led by buying in financial, and FMCG counters.
Story first published: Monday, December 7, 2020, 16:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X