స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ .. జోరు చూపించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు
విదేశీ మార్కెట్లో బలహీనం కావడం, జూన్లో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా పడిపోవడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మునుపటి రెండు సెషన్ లలో డోజి నమూనాలు ఏర్పడడంతో బలహీనతలతో నిరుత్సాహంగా ప్రారంభమయ్యాయి. మిడ్ సెషన్ నుండి రికవర్ అయినప్పటికీ చివరికి ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ 37 పాయింట్లు క్షీణించి స్వల్ప నష్టాలతో ముగిసింది.
ఫార్చ్యూన్ గ్లోబెల్ జాబితా: ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల్లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్
దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 38370 పాయింట్లు వద్ద ముగిసింది. 37 పాయింట్లు క్షీణించి సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో ముగియగా, 14 పాయింట్లు స్వల్ప నష్టంతో నిఫ్టీ 11308 పాయింట్ల వద్ద నిలిచింది. స్వల్ప ఒడిదుడుకులతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ హెచ్చుతగ్గులను చవి చూస్తూ మార్కెట్ ను స్వల్ప నష్టాల్లో ముగించాయి . అయితే అమ్మకాలు పెరగడంతో మొదట సెన్సెక్స్ 38,126 దిగువన కనిష్టాన్ని తాకింది. తదుపరి చివర్లో 38,414 వరకూ చేరుకుంది. ఇక నిఫ్టీ 11,243- 11,322 పాయింట్ల మధ్య కొట్టుమిట్టాడింది.
బ్యాంకుల నిధుల సేకరణకు ప్రోత్సాహకరమైన ప్రతిస్పందన కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ రంగ బ్యాంకులు జోరు చూపించాయి. పీఎస్యూ బ్యాంక్స్, ఆటో, మీడియా షేర్లు 2.7-3 శాతం మధ్య ఎగిశాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు మాత్రం కాస్త వెనకడుగు వేశాయి. ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు 1.5 శాతం నుండి 0.4 శాతం మధ్య నష్టపోయాయి.
ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఐషర్,హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హీరో మోటర్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, యూపీఎల్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇదే సమయంలో కొటక్ బ్యాంక్, బ్రిటానియా,సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, బీపీసీఎల్, విప్రో, బజాజ్ ఫిన్, ఎల్అండ్టీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్ 2-1 శాతం మధ్య క్షీణించాయి.