వార్ దెబ్బకు కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు..

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్ ని కుదిపేశాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సోమవారం మార్కెట్ ప్రారంభంలోనే స్టాక్స్ పై తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై ఉమ్మడి సైనిక దాడులు నిర్వహించడం, ఆ దేశ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ప్రకటన రావడంతో అంతర్జాతీయంగా మార్కెట్లలో తీవ్ర కలకలం రేగింది.

ఇక ఈ పరిణామాలకు ప్రతీకారంగా ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బహ్రెయిన్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్ సహా గల్ఫ్ ప్రాంతంలోని ఏడు దేశాలలో ఉన్న అమెరికా ఆస్తులపై దాడులు చేసింది. ఈ సంఘటనలు గ్లోబల్ మార్కెట్లలో భయాన్ని పెంచి, పెట్టుబడిదారులను రిస్క్‌ నుంచి దూరంగా నడిపించాయి. ఈ దాడులతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకగా, అమెరికా డాలర్ బలపడింది. అదే సమయంలో సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఇంధన మార్కెట్లలో ఈ ఉద్రిక్తతలు భారీ షాక్‌ను కలిగించాయి.

stock market crash 52 week low stocks 573 stocks hit 52 week low share market crash today Indian stock market fall Dalal Street crash midcap stocks fall smallcap stocks crash RVNL share price fall IRCTC share price crash Suzlon Energy shares fall Bajaj Housing Finance share price PSU stocks fall railway stocks crash energy stocks decline housing finance stocks fall heavy selling pressure market sell off today investor panic India equity market volatility 52 573 52 -

ఇరాన్‌పై సైనిక చర్యల అనంతరం.. ప్రపంచ చమురు, సహజ వాయు సరఫరాలో దాదాపు ఐదవ వంతు రవాణా జరిగే కీలక సముద్ర మార్గం అయిన హార్ముజ్ జలసంధి మూసివేయబడిన పరిస్థితులు ఏర్పడటంతో ముడి చమురు ధరలు నాలుగు సంవత్సరాలలోనే అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయి. బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 13 శాతం పెరిగి బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరుకుంది. ఇది జనవరి 2025 తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం.

చమురు ధరల ఈ ఉధృతి భారత మార్కెట్‌లో రంగాల వారీగా భిన్న ప్రభావాన్ని చూపించింది. అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలకు ఈ ధరల పెరుగుదల లాభదాయకంగా మారగా, డౌన్‌స్ట్రీమ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, అధిక ఇంధన వినియోగం ఉన్న రంగాలు ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే విమానయాన, పెయింట్స్ వంటి రంగాల షేర్లపై ప్రతికూల ప్రభావం కనిపించింది.

stock market గణాంకాలను పరిశీలిస్తే.. ఉదయం 11:15 గంటల నాటికి నిఫ్టీ50 సూచీ 353 పాయింట్లు లేదా 1.4 శాతం తగ్గి 24,826 వద్ద ట్రేడవుతోంది. ఇది రోజువారీ కనిష్ట స్థాయి అయిన 24,645ను కూడా తాకింది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 1,150 పాయింట్లు లేదా 1.42 శాతం క్షీణించి 80,138 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఈరోజు ఇంట్రాడేలో 78,543 అనే కనిష్టాన్ని నమోదు చేసింది. ఆరంభంలోనే సుమారు రూ.8లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరై పోయింది. ప్రస్తుతం మార్కెట్లు కాస్త కోలుకున్నా.. ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

విస్తృత మార్కెట్ కూడా ఈ పతనానికి అతీతం కాలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.4 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.5 శాతం నష్టపోయాయి. బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్ నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల బుకింగ్‌కు దిగడంతో 570కి పైగా స్టాక్స్ ఈరోజు 52 వారాల కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయి.

అస్థిరత సూచిక అయిన ఇండియా విక్స్ 16.40 శాతం పెరిగి 15.95కు చేరడం మార్కెట్లో భయ వాతావరణాన్ని స్పష్టంగా సూచిస్తోంది. అన్ని నిఫ్టీ రంగాల సూచీలు ఎరుపు రంగులో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆటో 2.3 శాతం, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ 1.8 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.7 శాతం నష్టపోయి అత్యధికంగా పడిపోయిన రంగాలుగా నిలిచాయి.

క్లుప్తంగా చెప్పాలంటే మధ్యప్రాచ్య సంక్షోభం గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తూ.. భారత స్టాక్ మార్కెట్లలో కూడా భారీ అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం మరింత పెరిగింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+