స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 8) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పాలసీ సమావేశం నిర్ణయాల అనంతరం సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 60,200 కూడా క్రాస్ చేసింది. ఉదయం గం.11.30 సమయానికి సెన్సెక్స్ ఉదయం 59,960.39 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,212.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,830.93 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,886.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,941.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,848.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 458.55 (0.77%) పాయింట్లు లాభపడి 60,142.53 పాయింట్ల వద్ద, నిఫ్టీ 134.10 (0.75%) పాయింట్లు ఎగిసి 17,924.45 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి 265 పాయింట్లు లాభపడి 59,927 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

ఆర్బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా కదలాడారు. శక్తికాంతదాస్ ప్రకటనకు ముందు 60,000 దిగువన ఉన్న సెన్సెక్స్ ఆర్బీఐ వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత 60,200 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, టాప్ లూజర్స్ జాబితాలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్స్, HUL, మారుతీ సుజుకీ నష్టపోయాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు (శుక్రవారం, అక్టోబర్ 8) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రివర్స్ రెపో రేటును, రెపో రేటును స్థిరంగా కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంతదాస్ తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించేందుకు 5-1 ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications