ముంబై: భారత స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో సాగుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 221.29 పాయింట్లు లేదా 0.59% నష్టపోయి 37,385.60 వద్ద, నిఫ్టీ 54.30 పాయింట్లు లేదా 0.49% పడిపోయి 11,019.20 వద్ద ప్రారంభమయ్యాయి. 572 షేర్లు లాభాల్లో, 465 షేర్లు నష్టాల్లో, 86 షేర్లలో ఎలాంటి మార్పులు లేకుండా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాసేపట్లోనే సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ 575 పాయింట్లు నష్టపోయి 37,032 వద్ద ట్రేడ్ అయింది. బ్యాంకులు, ఫైనాన్స్, ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాయి. బంధన్ బ్యాంకు షేర్లు ఏకంగా 10 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.

మెటల్, ఫార్మా స్టాక్స్ జూమ్
మధ్యాహ్నం గం.2 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్ర ఉన్నాయి. బ్యాంకు, ఎనర్జీ, ఐటీ, ఇన్ఫ్రా స్టాక్స్ అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ ఏకంగా 11,000 మార్క్ దిగువకు పడిపోయింది. కేవలం మెటల్, ఫార్మా స్టాక్స్ మాత్రమే కొనుగోళ్లు చూశాయి. జూలైలో ఆటో సేల్స్ కాస్త పుంజుకోవడంతో ఈ రంగం స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.

ఈ షేర్లు భారీగా జంప్
ఎన్ఎస్ఈలో ప్రయివేటు బ్యాంక్స్ రెండు శాతానికి పైగా నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ షేర్లు దాదాపు ఒక శాతం పడిపోయాయి. ఫార్మా, మెటల్తో పాటు పీఎస్యూ బ్యాంక్ షేర్లు ఒక శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ లాభాల్లో ఉన్నాయి. ఎన్ఎస్ఈలో బంధన్ బ్యాంకు పది శాతానికి పైగా కుంగిపోయింది. పలు షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు నష్టాలకు ఎదురీదుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం పెరిగింది. ఎన్ఎస్ఈలో యాంబర్ ఎంటర్ ప్రైజెస్, లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్ ఏడు శాతం నుండి 15 శాతం ఎగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్లు
కార్పోరేట్ ఆదాయాలు క్షీణించాయి. ఈ ప్రభావం కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ఈ వారం పడుతుంది. అమెరికా సహా వివిధ దేశాల ఉద్దీపనలు, ఎర్నింగ్స్ నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమవుతాయని అంటున్నారు. పాన్-యూరోపియన్ స్టాక్స్ 600 ప్రారంభంలో 0.2 శాతం నష్టపోయింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది. ట్రావెల్ స్టాక్స్ 1.8 శాతం, కెమికల్, ఆటో 0.6 శాతం చొప్పున నష్టపోయాయి.

బలహీనపడిన రూపాయి
డాలర్ మారకంతో రూపాయి ఈ రోజు 74.90 వద్ద ప్రారంభమైంది. 20 పైసల నష్టంతో 75.01 వద్ద ముగిసింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఈ ప్రభావం రూపాయి పైన పడింది. ఈ రోజు 74.88-75.03 మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో 74.81 వద్ద ముగిసింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications