ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం (సెప్టెంబర్) భారీ లాభాల్లో ముగిశాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎగిసిపడ్డాయి. ఉదయం ప్రారంభంలోనే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత అదే ఒరవడి కొనసాగించాయి. చివరకు సెన్సెక్స్ 646 పాయింట్లు లేదా 1.69 శాతం లాభంతో 38,840.32 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు లేదా 1.52 శాతం లాభంతో 11,449.25 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 39వేల సమీపానికి చేరుకోగా, నిఫ్టీ 11,500 సమీపానికి చేరుకుంది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.92 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం లాభపడింది. నేడు ఇన్వెస్టర్లు లాభాల వర్షంతో తడిసిపోయారు.

అదరగొట్టిన రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగం రిలయన్స్ రిటైల్లోకి సిల్వర్ లేక్ పెట్టుబడులు రావడం, కేకేఆర్ పెట్టుబడులు పెడుతుందనే వార్తలు, అమెజాన్తో చర్చలు జరుగుతున్నాయనే వాదనల నేపథ్యంలో ఈ షేర్లు అదరగొట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 7 శాతానికి పైగా లాభపడి రూ.2,314 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్ తర్వాత బీపీసీఎల్, ఏషియన్ పేయింట్స్, గ్రాసీమ్, ఐవోసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, హిండాల్కో, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.

నిఫ్టీ లాభంలో రిలయన్స్ వాటానే అధికం.. రూ.1 లక్ష కోట్లకు పైగా
నేటి మార్కెట్లో రిలయన్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ. నిఫ్టీ 171 పాయింట్లు లాభపడగా ఇందులో రిలయన్స్ కాంట్రిబ్యూషన్ 126 పాయింట్లు కావడం గమనార్హం. మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 బిలియన్ డాలర్లకు చేరుకున్న తొలి ఇండియన్ కంపెనీగా రిలయన్స్ ఘతన సాధించింది. రిలయన్స్ ఒక్కో షేర్ వ్యాల్యూ రూ.157.65 పైసలు ఎగబాకింది. ఈ రోజు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1 లక్ష కోట్లకు పైగా పెరిగింది.

మార్కెట్ లాభాలకు కారణం...
నిఫ్టీ లాభంలో రిలయన్స్ వాటానే ఎక్కువ. దీంతో మార్కెట్ లాభాలపై ఈ ప్రభావం పడింది. ఇతర అంశాల విషయానికి వస్తే చైనా - భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రభావం నిన్నటి వరకు మార్కెట్లపై పడింది. తాజాగా చర్చల నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు వరుసగా 0.9 శాతం, 0.7 శాతం లాభపడ్డాయి. కరోనా కేసు రికవరీలు పెరగడం, వ్యాక్సీన్ పైన మళ్లీ ఆశాజనక వార్తలు రావడం మార్కెట్లపై ప్రభావం కనిపించింది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications