ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జనవరి 28) భారీ నష్టాల్లో ముగిశాయి. గత గురువారం సెషన్లో సెన్సెక్స్ 50,000 మార్కును దాటినప్పటికీ దానిని నిలుపుకోలేక నష్టాల్లో ముగిసింది. నాటి నుండి వరుసగా నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2400 పాయింట్ల మేర నష్టపోయింది. నిన్న సెన్సెక్స్ 937 పాయింట్ల మేర నష్టపోయింది. డిసెంబర్ 21 తర్వాత అతి పెద్ద నష్టం ఇదే. 2021లో వచ్చిన లాభాలు అన్నీ కేవలం ఈ నాలుగు సెషన్లలోనే పోయాయి.

రూ.8 లక్షల కోట్లు ఫట్
గత నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు హరించుకు పోయింది. ఈ కాలంలో సెన్సెక్స్ 2,382 పాయింట్లు లేదా 4.78 శాతం నష్టపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,07,025.09 కోట్లు కరిగిపోయి రూ.1,89,63,547.48 కోట్లకు తగ్గింది. డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా అమ్మకాలకు మొగ్గు చూపుతారని, వచ్చేవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైన ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు.

2021లో నష్టాల్లోకి..
ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజు రూ.2.6 లక్షల కోట్లు హరించుకుపోయింది. నిన్న 938 పాయింట్లు, వరుసగా నాలుగు రోజుల్లో 2400 పాయింట్ల వరకు సెన్సెక్స్ నష్టపోవడంతో 2021లో సూచీలు నష్టాల్లోకి వెళ్లినట్లయింది. బ్యాంకింగ్, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో వరుసగా నాలుగో రోజు సూచీలు ఈ ఏడాది ప్రారంభం కంటే దిగువకు పడిపోయాయి.

ఇన్వెస్టర్ల ఆందోళన
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి బడ్జెట్లో అధిక పన్ను విధింపు ఆస్కారం ఉందనే అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బడ్జెట్ తర్వాత కొనుగోళ్ల కోసం కొంత మొత్తం చేతిలో ఉంటే మంచిదని భావిస్తున్న ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారి చెబుతున్నారు. గత పదేళ్ల కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే బడ్జెట్ ఈక్విటీ మార్కెట్ను మెప్పించింది.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications