For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: రాధాకిషన్ ధమాని ఎఫెక్ట్, 17% ఎగిసిన ఆంధ్రా పేపర్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 240.35 పాయింట్లు లేదా 0.68% నష్టపోయి 34,930.92 వద్ద, నిఫ్టీ 68.50 పాయింట్స్ లేదా 0.66% పడిపోయి 10,314 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.1.45 సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయింది. 614 షేర్లు లాభాల్లో, 621 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 72 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి ఉదయం 75.63 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో 75.64 వద్ద క్లోజ్ అయింది.

పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి: విచక్షణారహితంగా కాల్పులు, ఐదుగురి మృతి!పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి: విచక్షణారహితంగా కాల్పులు, ఐదుగురి మృతి!

ఆంధ్రా పేపర్స్ 17 శాతం ర్యాలీ

ఆంధ్రా పేపర్స్ 17 శాతం ర్యాలీ

ఆంధ్రా పేపర్స్ షేర్ ధర ఈ రోజు ఏకంగా 18 శాతానికి పైగా పెరిగింది. డీమార్ట్ అధినేత రాధాకిషన్ ధమానీకి చెందిన బ్రైట్ స్టార్ జూన్ 26వ తేదీన 1.25% వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఆంధ్రా పేపర్ షేర్ ఎగిసింది. ఒక్కో షేర్‌కు రూ.206.23 వద్ద 5 లక్షల షేర్లను కొనుగోలు చేసింది.

మార్కెట్ నష్టాలకు కారణం

మార్కెట్ నష్టాలకు కారణం

కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, రెండోసారి కరోనా విజృంభిస్తుందనే ఆందోళనలు స్టాక్ మార్కెట్‌ను నష్టాలకు పురికొల్పాయి. వివిధ నగరాల్లో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ కావడం దెబ్బతీసింది. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఎస్ అండ్ బీ హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మైనస్ 5 శాతం ఉండవచ్చునని అంచనా వేసింది.

కరాచీ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి

కరాచీ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి

పాకిస్తాన్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ భవనంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురైదుగురు మృతి చెందారు. నలుగురు మిలిటెంట్లు చొచ్చుకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి చొచ్చుకు వచ్చి ఉగ్రదాడి జరగడం కలకలం రేపింది.

English summary

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: రాధాకిషన్ ధమాని ఎఫెక్ట్, 17% ఎగిసిన ఆంధ్రా పేపర్స్ | Sensex dips 400 points: Andhra Paper share surges 17 percent after Damani buys stake

Radhakishan Damani-owned Bright Star Investments acquired 1.25 percent stake in Andhra Paper via open market transactions on June 26. Bright Star bought 5 lakh shares at Rs 206.23 per share, bulk deals data on the National Stock Exchange showed.
Story first published: Monday, June 29, 2020, 14:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X