ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 5) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 499.51 పాయింట్లు(1.23%) లాభపడి 41,115.65 వద్ద, నిఫ్టీ 143.80 పాయింట్లు(1.21%) ఎగిసి 12,052.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు (597) లాభాల్లో ఉంది.
729 షేర్లు లాభాల్లో, 182 షేర్లు నష్టాల్లో, 42 మార్పు లేకుండా ప్రారంభమైంది. ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. మెటల్, పీఎస్యూ బ్యాంకింగ్ రంగాలు భారీగా లాభపడ్డాయి. అన్ని రంగాలు కూడా పుంజుకున్నాయి. ఈ వారంలో నిన్నటి వరకు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. డాలర్ మారకంతో రూపాయి 74.29 వద్ద ప్రారంభమైంది.

ఐటీ సహా ఈ స్టాక్స్ అదరగొట్టాయి
ఉదయం గం.11 సమయానికి నిఫ్టీ ఆటో 0.81 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.15 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.97 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.97 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.66 శాతం, నిఫ్టీ ఐటీ 1.94 శాతం, నిఫ్టీ మీడియా 2.94 శాతం, నిఫ్టీ మెటల్ 2.50 శాతం, నిఫ్టీ ఫార్మా 0.62 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.25 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.38 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.83 శాతం లాభపడ్డాయి.
ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ, మీడియా, మెటల్ స్టాక్స్ అదరగొట్టాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో SBI(4.73శాతం), BPCL(4.23శాతం), టాటా స్టీల్ (3.97 శాతం), UPL (3.81 శాతం), HCL టెక్ టెక్ (3.43 శాతం) ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటా కార్ప్ (0.57 శాతం) ఉంది.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఎస్బీఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్ ఉన్నాయి.

ఎస్బీఐ భారీ జంప్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్టాక్ ఓ సమయంలో ఏకంగా 6 శాతం ఎగిసింది. రెండో త్రైమాసికంలో నికర లాభం 52 శాతం ఎగిసింది. దీంతో షేర్ 6.76 శాతం లాభపడి రూ.220ని తాకింది.
రిలయన్స్ స్టాక్ ధర కూడా 1.85 శాతం లాభపడి రూ.1,948 వద్ద ఉంది. ఓ సమయంలో రూ.1951ని దాటింది.
హ్యాపీయెస్ట్ మైండ్ స్టాక్ 5 శాతం క్షీణించింది.
HPCL 7 శాతం పెరిగింది.
సెన్సెక్స్ 30 స్టాక్స్లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 3.60 శాతం నుండి 0.03 శాతం మేర లాభపడ్డాయి.

ఐటీ స్టాక్స్ లాభాల్లో
ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్ 1.62 శాతం, హెచ్సీఎల్ టెక్ 3.09 శాతం, ఇన్ఫోసిస్ 1.74 శాతం, టెక్ మహీంద్ర 2.26 శాతం, విప్రో 0.96 శాతం, మైండ్ ట్రీ 1.33 శాతం, కోఫోర్జ్ 1.14 శాతం లాభపడ్డాయి.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్, జోబిడెన్లకు సమాన అవకాశాలు కనిపించిన పరిస్థితుల్లో అమెరికా, యూరోప్ మార్కెట్లు 1.5 శాతం నుండి 4 శాతం లాభాల్లో కనిపించాయి. ఈ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది. కాగా, ట్రంప్ కంటే జోబిడెన్ ముందంజలో ఉన్నారు. గెలుపుకు మెట్టు దూరంలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొనడం, ఫలితాలు బిడెన్ వైపు కాస్త మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఐటీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.
More From GoodReturns

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications