ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 5) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 499.51 పాయింట్లు(1.23%) లాభపడి 41,115.65 వద్ద, నిఫ్టీ 143.80 పాయింట్లు(1.21%) ఎగిసి 12,052.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు (597) లాభాల్లో ఉంది.
729 షేర్లు లాభాల్లో, 182 షేర్లు నష్టాల్లో, 42 మార్పు లేకుండా ప్రారంభమైంది. ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. మెటల్, పీఎస్యూ బ్యాంకింగ్ రంగాలు భారీగా లాభపడ్డాయి. అన్ని రంగాలు కూడా పుంజుకున్నాయి. ఈ వారంలో నిన్నటి వరకు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. డాలర్ మారకంతో రూపాయి 74.29 వద్ద ప్రారంభమైంది.

ఐటీ సహా ఈ స్టాక్స్ అదరగొట్టాయి
ఉదయం గం.11 సమయానికి నిఫ్టీ ఆటో 0.81 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.15 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.97 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.97 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.66 శాతం, నిఫ్టీ ఐటీ 1.94 శాతం, నిఫ్టీ మీడియా 2.94 శాతం, నిఫ్టీ మెటల్ 2.50 శాతం, నిఫ్టీ ఫార్మా 0.62 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.25 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.38 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.83 శాతం లాభపడ్డాయి.
ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ, మీడియా, మెటల్ స్టాక్స్ అదరగొట్టాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో SBI(4.73శాతం), BPCL(4.23శాతం), టాటా స్టీల్ (3.97 శాతం), UPL (3.81 శాతం), HCL టెక్ టెక్ (3.43 శాతం) ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటా కార్ప్ (0.57 శాతం) ఉంది.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఎస్బీఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్ ఉన్నాయి.

ఎస్బీఐ భారీ జంప్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్టాక్ ఓ సమయంలో ఏకంగా 6 శాతం ఎగిసింది. రెండో త్రైమాసికంలో నికర లాభం 52 శాతం ఎగిసింది. దీంతో షేర్ 6.76 శాతం లాభపడి రూ.220ని తాకింది.
రిలయన్స్ స్టాక్ ధర కూడా 1.85 శాతం లాభపడి రూ.1,948 వద్ద ఉంది. ఓ సమయంలో రూ.1951ని దాటింది.
హ్యాపీయెస్ట్ మైండ్ స్టాక్ 5 శాతం క్షీణించింది.
HPCL 7 శాతం పెరిగింది.
సెన్సెక్స్ 30 స్టాక్స్లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 3.60 శాతం నుండి 0.03 శాతం మేర లాభపడ్డాయి.

ఐటీ స్టాక్స్ లాభాల్లో
ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్ 1.62 శాతం, హెచ్సీఎల్ టెక్ 3.09 శాతం, ఇన్ఫోసిస్ 1.74 శాతం, టెక్ మహీంద్ర 2.26 శాతం, విప్రో 0.96 శాతం, మైండ్ ట్రీ 1.33 శాతం, కోఫోర్జ్ 1.14 శాతం లాభపడ్డాయి.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్, జోబిడెన్లకు సమాన అవకాశాలు కనిపించిన పరిస్థితుల్లో అమెరికా, యూరోప్ మార్కెట్లు 1.5 శాతం నుండి 4 శాతం లాభాల్లో కనిపించాయి. ఈ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది. కాగా, ట్రంప్ కంటే జోబిడెన్ ముందంజలో ఉన్నారు. గెలుపుకు మెట్టు దూరంలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొనడం, ఫలితాలు బిడెన్ వైపు కాస్త మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఐటీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications