కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికా, భారత్ సహా ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించి, సొంతగా ఉత్పత్తులు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇక, గాల్వాన్ ఘటన అనంతరం భారత ప్రజల్లో ఆత్మనిర్భర్ భారత్ సెంటిమెంట్ పెరిగింది. సాధ్యమైనన్ని ఉత్పత్తులు ఇక్కడే తయారు చేసుకోవాలని, తద్వారా చైనా నుండి దిగుమతులు తగ్గించాలని పరిశ్రమల నుండి ప్రజల వరకు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిక ఉత్పత్తి ఖర్చు సహా వివిధ కారణాలతో అప్పుడే సాధ్యం కాదని ప్రధాని ఎకనమిక్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ వీ అనంద నాగేశ్వరన్ అన్నారు. సరిహద్దు వివాదాల కారణంగా రక్షణ రంగం వ్యయం పెరిగే అవకాశముందన్నారు.

ఉత్పత్తి ఖర్చు సహా..
స్థానికంగా ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటం, నిబంధనలు తదితర ఎన్నో కారణాల వల్ల చైనాతో పోటీ అంత సులభం కాదని చెప్పారు. ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ వర్చువల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఆనంద నాగేశ్వరన్. ఈ సందర్భంగా భారత్లో వ్యాపారాల కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గించాలని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు ఉత్పత్తి ఖర్చు ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డ్రాగన్ దేశంతో అప్పుడే పోటీ పడలేమని.. అంటే దిగుమతులు తగ్గించుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

ఉత్పాదకతపై దృష్టి
చైనా నుండి వెళ్లిపోతున్న కంపెనీలు వియత్నాం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి దేశాలకు వెళ్లడానికి ఉత్పత్తి ఖర్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సహా ఎన్నో ఉన్నాయని చెప్పారు. వీటి కారణంగా మన దేశానికి రావడం తగ్గిందన్నారు. మనం ఈ పరిస్థితిని అధిగమించాలని నాగేశ్వరన్ సూచించారు. ఎక్కడో ఓచోట దీనిని ప్రారంభించాలని, మూడు నుండి ఆరు నెలల్లో ఇది పూర్తయ్యేది కాదని చెప్పారు. అవసరమైతే ప్రస్తుతం ఉత్పాదక పెంపుపై దృష్టి సారించాలన్నారు. అవసరం లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ప్రస్తుతం పక్కన పెట్టేయడం సమస్య పరిష్కారానికి ఓ మార్గం అన్నారు.

మరింతగా విస్తరించవచ్చు
ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటోందని నాగేశ్వరన్ చెప్పారు. ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి పరిస్థితులకు లోబడి ప్రభుత్వాలు... పరిశ్రమలకు సహకారం అందించే అవకాశాలు మరింతగా ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలకు కేంద్రం రూ.3 లక్షల కోట్లకు పైగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ను ప్రకటించింది. కంపెనీలకు ద్రవ్యపరమైన మద్దతు కోసం ఈ స్కీం తెచ్చింది. ఇది మరిన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగేలా విస్తరింప చేయవచ్చునన్నారు. ప్రభుత్వం పూర్తిగా గ్రాంట్స్ ఇచ్చే పరిస్థితులో లేదన్నారు. స్థూల ఆర్థిక డేటా క్రెడిబిలిటీని రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో పునరుద్ధరించాలన్నారు.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications