సాంకేతిక లోపంతో ఎన్ఎస్ఈలో నిలిచిన ట్రేడింగ్, లింక్స్ ఇష్యూనే కారణం!
NSEలో బుధవారం (ఏప్రిల్ 24) ట్రేడింగ్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్రేడింగ్ నిలిచిపోవడం ఆందోళన కలిగించింది. NSE ఎఫ్ అండ్ వోలో ఉదయం గం.11.40 నిమిషాల నుండి ట్రేడింగ్ నిలిచింది. దీంతో క్యాష్ మార్కెట్లోను NSE ట్రేడింగ్ ఆపేసింది. ట్రేడింగ్ నిలిచిపోవడంపై NSE స్పందించింది. ప్రస్తుతం సర్వర్ను రీస్టార్ట్ చేశామని, ట్రేడింగ్ ఎప్పుడు ప్రారంభించేది వెల్లడిస్తామని తెలిపింది.
అయితే సెన్సెక్స్ నార్మల్గానే కొనసాగింది. NSE 11 సెక్టార్ గెజ్ లైవ్ ప్రైస్ కోట్స్ అప్ డేట్ కావడం లేదు. ఇది రెండు సర్వీస్ ప్రొవైడర్లతో బహుళ టెలికం లింక్స్ ద్వారా పని చేస్తుంది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రెండు కూడా తమ లింక్స్లో సమస్యలు ఉన్నట్లు ధృవీకరించారని తెలుస్తోంది. ఇది ఎన్ఎస్ఈ సిస్టం పైన ప్రభావం చూపింది.
NSE ప్రైస్ అప్ డేట్ నిలిచిపోవడంతో అప్ డేట్ కోసం వేచి చూస్తున్న ట్రేడర్లు ఒక్కసారిగా షాకయ్యారు. NSEలో సాంకేతిక సమస్య తలెత్తి నిలిచిపోవడంపై నెటిజన్లు వివిధ రకాలుా కామెంట్స్ చేస్తున్నారు. బీఎస్ఈ అన్ని విభాగాలలో సాధారణ ట్రేడింగ్ కొనసాగుతోంది.