మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597 కోట్లుగా ఉన్నాయి. రూ.1 లక్ష కోట్ల కంటే తక్కువ నమోదు కావడం నాలుగు నెలల తర్వాత ఇప్పుడే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ప్రభావం జీఎస్టీ వసూళ్లపై పడింది. మార్చి నెలకు రూ.97,597 కోట్లు వసూలు కాగా ఇందులో రూ.19,183 కోట్లు సీజీఎస్టీ, రూ.25,601 కోట్లు ఎస్జీఎస్టీ, రూ.44,508 కోట్లు ఐజీఎస్టీ కింద, రూ.8,306 కోట్లు సెస్ రూపంలో వసూలయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
2019 మార్చి నెలలో రూ.1.06 లక్షల కోట్లు వసూలయ్యాయి. దీంతో పోలిస్తే 8.4 శాతం తగ్గుదల నమోదయింది. సమ్మిళిత జీఎస్టీ నుండి కేంద్ర వాటా రూ.19,718 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.14,915 కోట్లుగా ఉండనుంది. ఫలితంగా కేంద్రానికి రూ.41,901 కోట్లు, రాష్ట్రాలకు రూ.43,516 కోట్లు లభిస్తాయి.

2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 83 లక్షల జీఎస్టీ రిటర్న్స్ నమోదయ్యాయి. మార్చిలో 76.5 లక్షలకు తగ్గాయి. మార్చి చివరి పది రోజుల్లో జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రభావం కారణంగా ఎక్కువ వ్యాపారాలు మూతబడటం ఇందుకు కారణం.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications