మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597 కోట్లుగా ఉన్నాయి. రూ.1 లక్ష కోట్ల కంటే తక్కువ నమోదు కావడం నాలుగు నెలల తర్వాత ఇప్పుడే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ప్రభావం జీఎస్టీ వసూళ్లపై పడింది. మార్చి నెలకు రూ.97,597 కోట్లు వసూలు కాగా ఇందులో రూ.19,183 కోట్లు సీజీఎస్టీ, రూ.25,601 కోట్లు ఎస్జీఎస్టీ, రూ.44,508 కోట్లు ఐజీఎస్టీ కింద, రూ.8,306 కోట్లు సెస్ రూపంలో వసూలయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
2019 మార్చి నెలలో రూ.1.06 లక్షల కోట్లు వసూలయ్యాయి. దీంతో పోలిస్తే 8.4 శాతం తగ్గుదల నమోదయింది. సమ్మిళిత జీఎస్టీ నుండి కేంద్ర వాటా రూ.19,718 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.14,915 కోట్లుగా ఉండనుంది. ఫలితంగా కేంద్రానికి రూ.41,901 కోట్లు, రాష్ట్రాలకు రూ.43,516 కోట్లు లభిస్తాయి.

2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 83 లక్షల జీఎస్టీ రిటర్న్స్ నమోదయ్యాయి. మార్చిలో 76.5 లక్షలకు తగ్గాయి. మార్చి చివరి పది రోజుల్లో జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రభావం కారణంగా ఎక్కువ వ్యాపారాలు మూతబడటం ఇందుకు కారణం.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications