Wipro: త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన విప్రో.. డివిడెంట్ ఎంతంటే.. ?
ఐటి కంపెనీ విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 2022తో ముగిసిన మూడో త్రైమాసికం ఫలితాలు ప్రకటించంది. Q3లో ఏకీకృత PAT వరుసగా రెండంకెల వృద్ధిని సాధించింది. అదే సమయంలో ఆదాయం కూడా పుంజుకుంది. విప్రో అట్రిషన్ రేట్ కాస్త ఎక్కువగానే ఉంది. కంపెనీ ఈక్విటీ షేర్కి రూ.1 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జనవరి 25, 2023ని రికార్డు తేదీగా నిర్ణయించింది. చెల్లింపు ఫిబ్రవరి 10, 2023న జరగనుంది.
2.82 శాతం
ఈ త్రైమాసికంలో 2.82 శాతం వృద్ధితో రూ. 3,052.9 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది క్రితం రూ. 2,969 కోట్లుగా ఉంది. ఏకీకృత ఆదాయం రూ. 23,229 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 20,313.6 కోట్లతో పోలిస్తే ఇది 14.35 శాతం పెరిగిందని విప్రో ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.
జీతాల పెంపు
"జీతాల పెంపుదల, పదోన్నతులు, సీనియర్ నాయకత్వానికి దీర్ఘకాలిక ప్రోత్సాహకాల ద్వారా మార్జిన్ల విస్తరణ జరిగింది" అని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ అన్నారు. కంపెనీ త్రైమాసికంలో దాని నికర ఆదాయంలో 143 శాతం వద్ద "బలమైన" ఆపరేటింగ్ నగదు ప్రవాహాలను నమోదు చేసింది.
ఆనంద్ రాఠీ
మరో కంపెనీ ఆనంద్ రాఠీ వెల్త్ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. అక్టోబర్-డిసెంబర్ 2022 (Q3FY23)కి ఏకీకృత నికర లాభం రూ.43 కోట్లుగా నివేదించింది. అక్టోబర్-డిసెంబర్ 2021 (Q3FY22)తో పోలిస్తే 35% పెరుగుదల నమోదు చేసింది. దీంతో శుక్రవారం, ఆనంద్ రాఠీ షేరు BSEలో 1.95% పెరిగి ఒక్కొక్కటి ₹769.55 వద్ద ముగిసే ముందు 52 వారాల గరిష్ట స్థాయి ₹780ని తాకింది.