Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. అది తగ్గటమే కారణమా..?
గత కొన్నాళ్లుగా బుల్ జోరును కొనసాగిస్తున్న భారత స్టాక్ మార్కెట్లు నేడు డీలా పడ్డాయి. ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
Stock Market: గత కొన్నాళ్లుగా బుల్ జోరును కొనసాగిస్తున్న భారత స్టాక్ మార్కెట్లు నేడు డీలా పడ్డాయి. ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
మార్కెట్ సూచీలు..
ఈ రోజు మార్కెట్లు నష్టాలతో ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్కె సూచీ సెన్సెక్స్ ఉదయం 9.48 గంటల సమయంలో 298 పాయింట్లు, నిఫ్టీ సూచీ 99 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 339 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 223 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.
కారణం ఏమిటి..?
నేడు భారత మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవటానికి కొన్ని కారణాలు కీలకంగా మారాయి. ఇందులో ముందుగా అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో ముగియటం ఒకటి. దీనికి తోడు రానున్న ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును మూడీస్ 5.6 శాతానికి పరిమితం చేయటం కొంత ఆందోళనలను పెంచుతోంది.అయితే ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే ఇండియా ఆర్థికంగా మెరుగైన పనితీరును కనబరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
టాప్ గెయినర్స్..
NSE సూచీలో హిందాల్కొ, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, మారుతీ, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.
టాప్ లూజర్స్..
అదానీ పోర్ట్స్, ఎస్బీఐఎన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ ప్రైజస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.