న్యూఢిల్లీ: కొత్త సంవత్సరవేళ ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకులకు షాకిచ్చింది. రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచారు. అయితే ఈ ఛార్జీలు అతి స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ఛార్జీలు జనవరి 1, 2020 నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇప్పటికే టిక్కెట్స్ బుక్ చేసుకున్న వారికి మినహాయింపు ఉంది. ఛార్జీలు పెరగడానికి ముందే టిక్కెట్స్ బుక్ చేసుకున్నందున వారు ఎక్కువగా చెల్లించవలసిన అవసరం మాత్రం లేదు.
అయితే ఈ (డిసెంబర్ 31) అర్ధరాత్రి నుంచి టిక్కెట్ కొనుగోలు చేసేవారికి మాత్రం పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. రైల్వే ఛార్జీలను రేషనలైజ్ చేస్తామని చెప్పడం ద్వారా ఇటీవల రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ ఛార్జీల పెంపుపై హింట్ ఇచ్చారు.

ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్కు కిలో మీటర్కు ఒక పైస చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మెయిల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్కు కిలో మీర్కు రూ.2 పైసల చొప్పున పెంచారు. ఏసీ చైర్ కార్, ఏసీ 3, 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్కు కిలో మీటరుకు 4 పైసల చొప్పున పెంచారు. అయితే సబర్బన్ రైళ్లలో మాత్రం ఛార్జీలు పెంచలేదు. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక 2014లో రైల్వే ఛార్జీలు పెంచారు. అప్పుడు ప్రయాణ ఛార్జీలు 14.2 శాతం, సరకు రవాణా ఛార్జీలు 6.5 శాతం మేర పెరిగాయి.
చదవండి: బ్యాడ్ న్యూస్: పెరగనున్న రైలు చార్జీలు, ఎంతో తెలుసా?
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications