కొద్ది నెలల క్రితం రూ.33 వేల నుంచి రూ.34 వేల మధ్య ఉన్న బంగారం హఠాత్తుగా రూ.40 వేలకు చేరుకుంది. ఆ తర్వాత రూ.38 వేలకు అటు ఇటుగా కదలాడింది. సోమవారం రూ.39 వేల వద్ద కదలాడింది. బంగారం ధరల ఎగుడు దిగుడులకు అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, డాలర్తో రూపాయి మారకం విలువ మొదలగు ప్రభావాలు ఉంటాయి. బంగారం ధర రూ.40,000 వద్ద కదలాడుతున్న నేపథ్యంలో ఇంకా తగ్గుతుందేమోనని చూసి కొనుగోలు చేసే వారు ఉంటారు. కానీ వచ్చే ఏడాది (2020) బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అంచనా.

బంగారం ధర రూ.45,000కు చేరుకోవచ్చు
భౌగోళిక రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, రూపాయి అస్థిరత వంటి వివిధ కారణాలతో బంగారం ధర కొత్త ఏడాదిలో (2020) 10 గ్రాములకు రూ.45,000కు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. తద్వారా కొత్త సంవత్సరం బంగారం మరింత ఖరీదుగా మారే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఆర్బీఐ సహా బంగారం నిల్వలు పెంచుకున్న కేంద్ర బ్యాంకులు
2019 ఏడాదిలో ఆయా దేశాల ప్రభుత్వ విధానాలు, స్టాక్ మార్కెట్ వంటి కారణాలతో బంగారం హెచ్చతగ్గులను చూసింది. ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరంలో మాత్రం బంగారం ధర అంతకంతకూ పెరిగింది. ఇందుకు అమెరికా - చైనా ట్రేడ్ వార్ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకున్నాయి. ఆర్బీఐ సహా 14 కేంద్ర బ్యాంకులు ఈ ఏడాది ఒక టన్నుకు పైగా బంగారం నిల్వలు పెంచుకున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ డేటా వెల్లడిస్తోంది.

బంగారం సురక్షిత పెట్టుబడి...
2020 సంవత్సరంలో పెట్టుబడిదారులు భౌగోళిక రాజకీయ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చునని, అలాగే స్టాక్ మార్కెట్ ప్రభావం కూడా బంగారంపై ఉండే అవకాశముందని, దీంతో పసిడిని సురక్షిత పెట్టుబడిగా భావించి ఎక్కువమంది ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉండవచ్చునని కామ్ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అభిప్రాయపడ్డారు.

ఈ కారణంతో బంగారానికి డిమాండ్
అమెరికా - చైనా ట్రేడ్ వార్ అంశంతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంఘర్షణలు ఇబ్బందులను సృష్టించవచ్చునని, ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడులకు డిమాండ్ పెరుగవచ్చునని, ఇది ధరల పెరుగుదలకు దారి తీస్తుందని జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పీటీఐతో అన్నారు. 2020 చివరలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా ఉండవచ్చునని చెప్పారు.

రూ.41,000 నుంచి రూ.45,000..
ఇలా వివిధ కారణాలతో బంగారం ధర ఎంసీఎక్స్లో 10 గ్రాములు రూ.41,000 నుంచి 41,500లకు (USD 1,640-1,650) చేరుకోవచ్చునని, గరిష్ఠంగా రూ.44,500-45,000ల (USD 1,795-1,800) వరకు ఉండవచ్చునని త్యాగరాజన్ చెప్పారు.

కొనుగోళ్లు బలంగా ఉన్నాయి..
రూపాయి సహా అన్ని కరెన్సీలు కూడా గతంలోని గరిష్టస్థాయిని దాటేశాయని, ఇది మార్కెట్లలో వినియోగదారుడి డిమాండును మ్యూట్ చేసిందని వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం అన్నారు. భారత్ విషయానికి వస్తే ఈ ఏడాది (2019) మూడో క్వార్టర్లో బంగారానికి డిమాండ్ పెరిగిందని, 4వ క్వార్టర్లో పెళ్లిళ్లు, పండుగల వంటి వివిధ కారణాలతో డిమాండ్ పెరిగినప్పటికీ, మొత్తంగా ఏడాది లెక్కన మాత్రం డిమాండ్ తగ్గిందని చెప్పారు. అమెరికా, యూరోప్లలో ఈటీఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్), సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు బలంగా ఉన్నాయన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

Gold: దుబాయ్లో డిస్కౌంట్కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!



Click it and Unblock the Notifications