రూ.40,000 మార్క్ వద్ద బంగారం ధరలు, మరింత పెరుగుతాయా?
న్యూఢిల్లీ: బంగారం ధరలు శుక్రవారం (జనవరి 24) దాదాపు నిలకడగా ఉన్నాయి. ముంబై మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.53 తగ్గి రూ.40,023గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబై రిటైల్ మార్కెట్లో రూ.36,661 (ప్లస్ జీఎస్టీ), 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40,023 (ప్లస్ జీఎస్టీ) ఉంది. 18 క్యారెట్ల గోల్డ్ కోటెడ్ ధర రూ.30,017 (ప్లస్ జీఎస్టీ)గా ఉంది.
ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 0.52 శాతం తగ్గి రూ.40,075గా ఉంది. అంతకుముందు సెషన్లో బంగారం ధర 0.8 శాతం పెరిగింది. వెండి ధరలు కూడా శుక్రవారం స్వల్పంగా పడిపోయాయి. ఎంసీఎక్స్లో వెండి ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి కిలో రూ.46,177గా ఉంది. అందరి చూపులు ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పాలసీ (ECB)పై ఉంది.
అమరావతి వల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు డిమాండ్ పెరిగిందా?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు 0.2 శాతం తగ్గి 1,560.50 డాలర్లుగా ఉంది. వెండి ధరలు 0.2 శాతం తగ్గి 17.76 డాలర్లుగా ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పసిడి కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారని, దీంతో ధరలు పెరుగుతాయని అంటున్నారు.