ముంబై: ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డెల్టాటెక్.. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేయనుంది. దీనికి అవసరమైన కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను సమర్పించింది. దీనిపై సెబి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
సెబి నుంచి అనుమతులు లభించిన వెంటనే డెల్టాటెక్ ఫర్మ్.. తన పబ్లిక్ ఇష్యూను జారీ చేయ్యొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూను జారీ చేస్తుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. డెల్టా కార్ప్కు అనుబంధంగా కొనసాగుతున్న ఆన్లైన్ గేమింగ్ ఫర్మ్ ఇది. అడ్డా52, అడ్డా డాట్ గేమ్స్ను ప్రమోట్ చేస్తోంది.

పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 550 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కింద 250 కోట్ల రూపాయలు, మిగిలిన మొత్తాన్ని ఫ్రెష్ పబ్లిక్ ఇష్యూలను జారీ చేయడం ద్వారా సేకరించుకోనున్నట్లు సెబికి అందజేసిన తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్లో పొందుపరిచింది.
డెల్టా కార్ప్కు అనుబంధంగా కొనసాగుతున్న సంస్థ ఇది. గతంలో గాస్సియన్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన గేమింగ్ కార్యకలాపాలను కొనసాగించింది. కాగా డెల్టా టెక్ తరఫున ఐపీఓను జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన వెంటనే డెల్టా కార్ప్ షేర్ల ధరలు పెరిగాయి. అయిదు శాతం మేర వాటి ధరల్లో పెరుగుదల కనిపించింది.
ఈ డెల్టా కార్ప్లో స్టార్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు పెద్ద ఎత్తున స్టేక్స్ ఉన్నాయి. వాటిని ఆయన క్రమంగా విక్రయిస్తోన్నారు. కిందటి నెలలో డెల్టా కార్ప్కు చెందిన 25 లక్షల షేర్లను ఆయన స్టాక్ మార్కెట్లో సేల్ చేశారు. ఇప్పుడు మళ్లీ మరో ఆరుశాతం మేర కోత పెట్టారు. ఆయన భార్య రేఖా ఝున్ఝున్వాలా కూడా 3.25 శాతం మేర డెల్టా కార్ప్ షేర్లను అమ్మి వేశారు.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications