ముంబై: ఆదాయపు పన్ను స్లాబ్స్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఐటీ స్లాబ్స్ను యథాతథంగా ఉంచారు. తాజా బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్స్లో మార్పులు లేకపోయినప్పటికీ, 80సీ వంటి ఇతర మినహాయింపులకు సంబంధించి కాస్త పెంపు ప్రకటన వస్తుందని భావించారు. అయితే అందరూ ఊహించినట్లుగా స్లాబ్స్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో సెక్షన్ 80సీ మినహాయింపు పరిమితిలోను మార్పులు చేయలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు చర్యలు చేపట్టినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.
ఆదాయపు పన్ను స్లాబ్స్లో లేదా పన్ను మినహాయింపు పరిమితిలో మార్పులు చేయకపోవడం మధ్యతరగతి వారికి, శాలరైడ్కు కాస్త నిరాశకు గురి చేసే అంశం. అదే సమయంలో ఓ శుభవార్త కూడా ఉంది. కరోనా నేపథ్యంలో ఎక్కువ ఆదాయం వచ్చే వారిపై కరోనా సెస్ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ బడ్జెట్లో ఎలాంటి కరోనా సెస్ను ప్రకటించలేదు.

సీనియర్ సిటిజన్లకు నిర్మలమ్మ సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. పెన్షన్ పైన మాత్రమే ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయిస్తున్నట్లు తెలిపారు. 75 ఏళ్లు పైబడిన వారు ఇక ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అవసరంలేదు. గృహ రుణాలపై పన్ను మినహాయింపును మరో ఏడాది పాటు 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications