హోలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు
హోలీ సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) నేడు (మార్చి 29) క్లోజ్ అయ్యాయి. హోల్ సేల్ కమోడిటీ మార్కెట్లు మెటల్, బులియన్ మార్కెట్లు కూడా నేడు క్లోజ్ అయ్యాయి. ఫారెక్స్ ట్రేడింగ్, కమోడిటీ ఫ్యూచర్స్ కూడా బంద్ ఉంది. క్రితం సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 568.38 పాయింట్లు లేదా 1.17 శాతం లాభపడి 49,008.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 182.40 పాయింట్లు లేదా 1.27 శాతం ఎగిసి 14,507.30 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈక్విటీ మార్కెట్ ఆర్థిక వృద్ధి రికవరీని కోల్పోతుందనే ఆందోళనతో ఏకీకృతం అవుతోంది. పాజిటివ్ యూఎస్ జాబ్ డేటా, నాలుగో త్రైమాసికంలో యూఎస్ జీడీపీ 4.3 శాతానికి పెరిగిందని గుర్తు చేస్తున్నారు. అధిక ఫ్రీక్వెన్సీ డేటా Q4FY21లో మంచి ఎకనమిక్ యాక్టివిటీని సూచిస్తోందని, ఏప్రిల్ నుండి కంపెనీల ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు.
క్రితం సెషన్లో అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్ సూచీ 3.6 శాతం లాభపడగా, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఒక్కో శాతానికి పైగా లాభపడ్డాయి. గతవారం డాలర్ మారకంతో ఇండియన్ రూపాయి ఫ్లాట్గా 72.51 వద్ద ముగిసింది.