కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. వైరస్ కారణంగా వ్యాపారాలు లేక, ఉద్యోగాలు పోయి, వేతనాల కోత వల్ల... ఇలా వివిధ కారణాలతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. మహమ్మారి సమయంలో తమ కుటుంబ పోషణ కోసం దాదాపు సగం మంది భారతీయులు రుణాలు తీసుకున్నారని హోమ్ క్రెడిట్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా మూడు కారణాలతో సామాన్యులు రుణాలు తీసుకున్నారు. మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ సమయంలో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.

వేతనాల కోత లేదా ఆలస్యం మొదటి కారణం
కరోనా కాలంలో 46 శాతం మంది భారతీయులు తమ ఇంటిని నడిపేందుకు రుణాలు తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో మొదటిది వేతనాల కోత లేదా వేతనాలు ఆలస్యం కావడం. ఉద్యోగులు సాధారణంగా ప్రతి నెల వేతనం తేదీని బట్టి అన్నింటిని ప్లాన్ చేసుకుంటారు. కానీ వేతన కోత, వేతనాలు ఆలస్యం కావడం వల్ల కమిట్మెంట్స్ కోసం లేదా కుటుంబ పోషణ కోసం రుణాలు చేయవలసి వచ్చింది. ముఖ్యంగా మధ్య తరగతి వారికి రుణాలు మించిన ఆప్షన్ లేదు. 27 శాతం మంది వేతనాల కోత లేదా ఆలస్యం వల్ల రుణాలు తీసుకున్నారు.

రెండో కారణం ఈఎంఐ
భారతీయులు ఎక్కువమంది రుణాలు తీసుకోవడానికి మరో కారణం. ఈఎంఐ చెల్లింపులు. ఉద్యోగులు పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోమ్ లోన్ వంటివి తీసుకుంటుంటారు. అప్పటికే ఉన్న రుణాలపై ఈఎంఐ చెల్లింపులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం అవకాశం కల్పించినప్పటికీ ఆ తర్వాత భారంగా మారుతుందనో లేదా మరో కారణంతోనో రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లించారు.

ఉద్యోగ కోత వల్ల 14 శాతంమంది రుణబాట
ఇక, మరో ప్రధాన కారణం ఉద్యోగాలు పోవడం. కరోనా కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తమ కుటుంబ పోషణ కోసం లేదా అప్పటికే తీసుకున్న లోన్లకు సంబంధించి ఈఎంఐలు చెల్లించేందుకు రుణాలు తీసుకునే పరిస్థితి. మిడిల్ క్లాస్ కుటుంబాలపై ఎక్కువగా ప్రభావం పడింది. నివేదిక ప్రకారం కరోనా కాలంలో 14 శాతం మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి రుణాలు తీసుకున్నారు.
స్నేహితులు, బంధువుల నుండి రుణాలు తీసుకోవడం ఎక్కువగా ముంబై (27 శాతం), భోపాల్ (27 శాతం), ఢిల్లీ (26 శాతం), పాట్నా (25 శాతం) ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications