రెండ్రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల సంపద ఆవిరి, 5 కారణాలు...

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో రెండు చమురు క్షేత్రాలపై దాడి తదితర పరిణామాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 642 పాయింట్లు కోల్పోయి 36,481 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 186 పాయింట్లు నష్టపోయి 10,817 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 నష్టాలను చవి చూశాయి. మార్కెట్ నష్టాలకు ఆయిల్ సహా పలు కారణాలు ఉన్నాయి. మరోవైపు రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు.

రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల నష్టం

రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల నష్టం

మార్కెట్ పతనం నేపథ్యంలో బీఎస్ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే లిస్టెట్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.2.37 లక్షల కోట్లు తగ్గి రూ.139.70 లక్షల కోట్లకు పడిపోయింది. వరుసగా రెండు రోజులు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.2.72 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఈ రెండు రోజుల్లో అక్షరాలా రూ.2,72,593.54 కోట్లు తగ్గి రూ.1,39,70,356.22 కోట్లకు చేరుకుంది.

చమురు సంక్షోభం

చమురు సంక్షోభం

మార్కెట్ల నష్టానికి పలు కారణాలు ఉన్నాయి. సోమవారం బ్రెంట్ చమురు బారీగా పెరగడంతో మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. మంగళవారం ధరలు స్థిరపడినప్పటికీ సరఫరాపై అనిశ్చితి కొనసాగింది. సోమవారం నాటితో పోలిస్తే ముడి చమురు ధర నిలకడగానే ఉంది. ధరలు తగ్గినా ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు. సౌదీ అరేబియా నుంచి ముడి చమురు ఎగుమతులు సాధారణ స్థాయికి చేరుకునేందుకు మరో వారం పది రోజులు పడుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు ఇరాన్ పైన సైనిక చర్యకు సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా కారణం.

చైనా మందగమనం

చైనా మందగమనం

ఆగస్ట్ నెలలో చైనా పారిశ్రామిక ఉత్పత్తి 4.4 శాతం తగ్గింది. ఇది పదిహేడేళ్ల కనిష్టం. చైనా తయారీ మందగమనాన్ని సూచిస్తోంది. ఇది మార్కెట్ పైన ప్రభావం పడిందని చెబుతున్నారు.

ఆటో సేల్స్

ఆటో సేల్స్

ముడి చమురు ధరలు దూసుకెళ్లడంతో డిమాండ్ మరింత తగ్గవచ్చుననే అంచనాలతో వాహన షేర్లు మరింతగా దిగజారాయి. హీరో, టాటా మోటార్స్, మారుతీ సుజుకీలతో కూడిన నిఫ్టీ వాహన సూచీ 3.83 శాతం క్షీణించింది.

ఫెడ్ సమావేశం

ఫెడ్ సమావేశం

అమెరికా ఫెడ్ పరపతి సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. వడ్డీ రేట్ల కోత ఉండవచ్చునని భావిస్తున్నారు. మరిన్ని గణాంకాల కోసం ఫెడ్ ఎదురు చూడవచ్చునని చెబుతున్నారు.

రూపాయి పతనం..

రూపాయి పతనం..

డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కూడా మార్కెట్‌ను భయపెట్టింది. మంగళవారం ఆరంభంలో డాలర్ మారకంతో రూపాయి 71.83గా ప్రారంభం కాగా, ఇంట్రాడేలో ఓ దశలో 71.98 వరకు పతనమైంది. చివరలో కాస్త కోలుకొని 18 పైసల నష్టంతో 71.78 వద్ద క్లోజ్ అయింది. ఇటీవల ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా ఉండవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+