మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర, రూ.1,300 పెరిగిన వెండి
ఇప్పుడిప్పుడే తగ్గుతున్న బంగారం ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. ఫెస్టివల్ సీజన్కు తోడు సౌదీ అరేబీయాలోని రెండు చమురు క్షేత్రాలపై దాడి ప్రభావం బంగారంపై కూడా పడింది. కొద్ది రోజుల క్రితం 10 గ్రాముల 99.9 ప్యూరిటీ కలిగిన బంగారం ధర రూ.40,000 పైకి చేరుకున్నా తర్వాత రూ.38,000కు దిగివచ్చింది. అయితే చమురు ధరలు పెరుగుతుండటంతో పసిడి ధరలు కూడా పెరిగాయి.
డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా
పెరిగిన బంగారం ధర, హైదరాబాద్లో ఎంతంటే..
సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 12 డాలర్లు పెరిగి రూ.1,504 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావం భారత్ పైన కూడా పడింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.460 పెరిగి రూ.38,860కి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.1,096 పెరిగి రూ.47,957కు చేరింది. హైదరాబాదులో సోమవారం రాత్రికి 10 గ్రాముల బంగారం ధర రూ.39,100 పలికింది. వెండి కిలో రూ.47,500గా ఉంది.
రూపాయి మారకం ఎఫెక్ట్ కూడా...
డాలర్తో రూపాయి మారకం విలువ పతనం కావడం కూడా పసిడి, వెండి వంటి లోహాలు అధికం కావడానికి దోహదపడింది. శనివారం బంగారం ధర రూ.38,400 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ గోల్డ్లో రాత్రి ఏడున్నర గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధర 1.10 శాతం లేదా రూ.413 పెరిగి రూ.37,937 వద్ద ఉంది. శుక్రవారం బంగారం రూ.37,503 వద్ద క్లోజ్ అయింది. సోమవారం సాయంత్రానికి 1.7 శాతం పెరిగి రూ.38,163 వద్ద కూడా ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్లో వెండి 3 శాతం లేదా రూ.1326 పెరిగి రూ.47,087 వద్ద ఉంది.
1 శాతం పెరిగిన బంగారం..
చమురు క్షేత్రాలపై దాడి నేపథ్యంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1 శాతం పెరిగాయి. పలువురు ఇన్వెస్టర్లు పెట్టుబడులకు స్వర్గదామంగా భావిస్తున్న పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు.
అందుకే ధరలు పుంజుకున్నాయి..
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు కారణంగా వెండి కిలో రూ.1,096 పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ తపన్ పటేల్ అన్నారు. న్యూయార్క్లో ఔన్స్ బంగారం ధర 1,504 డాలర్లు ఉండగా, వెండి 17.87 డాలర్లకు చేరుకుంది. మధ్య ప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయన్నారు.