నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసి కొద్దిగా ఇన్వెస్టర్లలో భయాన్ని పోగొట్టాయి. నిఫ్టీ ఈ రోజు మళ్లీ 11600 పాయింట్ల మార్కును టచ్ చేసినట్టే చేసి వెనక్కి వచ్చినప్పటికీ 11550 పాయింట్లపైనే ముగియడం కాస్త ఊరటనిచ్చే అంశం. రోజంతా 70-80 పాయింట్ల రేంజ్లోనే కదడాలిన సూచీలు చివరకు పటిష్టంగానే క్లోజయ్యాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతు నేపధ్యంలో నిఫ్టీ లాభాల బాటలో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన కొన్ని ప్రోత్సాహక సంకేతాలు కూడా దోహదపడ్డాయి. చివరకు సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 38824 దగ్గర ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 11583 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్ల పెరిగి 30716 దగ్గర క్లోజైంది.
మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్, రియాల్టీ, ఆటో స్టాక్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. సెక్టోరల్ సూచీలన్నీ లాభాల్లో ముగియడం ప్రధానంగా గమనించాల్సిన మరో అంశం. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు రెండూ అర శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి.

జీ ఎంటర్టైన్మెంట్, జీఎస్డబ్ల్యు స్టీల్, హీరోమోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ స్టాక్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.
మెటల్ స్టాక్స్ గెయిన్
వాణిజ్య యుద్ధ పరిష్కారానికి సంబంధించి అమెరికా - చైనా మధ్య మళ్లీ చర్చలు కొలిక్కిరావొచ్చనే అంచనాలతో మెటల్ స్టాక్స్ మళ్లీ పరుగు తీశాయి. జెఎస్డబ్ల్యు స్టీల్ 5 శాతం, జిందాల్ హిసార్ 3.5 శాతం, హిందాల్కో-వేదాంతా 2.7 శాతం పెరిగాయి. మెటల్ ఇండెక్స్లో ఎన్ఎండిసి ఒక్కటే 2.5 శాతం నష్టపోయింది.
డిహెచ్ఎఫ్ఎల్ - రిజల్యూషన్ ప్లాన్
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్కు ఇచ్చి రుణాల రికవరీ సహా ప్రస్తుత ఆర్థిక స్థితగతులను అంచనా వేసేందుకు రుణగ్రహీలంతా ఈ రోజు భేటీ అయ్యారు. పరిష్కార ప్రణాళిక నేపధ్యంలో స్టాక్ ఈ రోజు కొద్దిగా రికవర్ అయింది. రూ.69 వరకూ పడిపోయిన స్టాక్ చివరకు కోలుకుని రూ.71.25 దగ్గర క్లోజైంది. 2 శాతం వరకూ లాభపడింది.
ఇండిగో - రికవరీ
ఇద్దరు ప్రమోటర్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరి వ్యవహారం సెబీ దగ్గరకు చేరడం ఈ రోజు కూడా స్టాక్ను ఆందోళనకు గురిచేసింది. ఈ వ్యవహారంపై సెబీ దర్యాప్తును మొదలుపెట్టిన నేపధ్యంలో స్టాక్ ఇంట్రాడేలో రూ.1273కి దిగొచ్చింది. చివరకు 7 శాతం వరకూ కోలుకున్నప్పటికీ 3 శాతం నష్టాలతో రూ.1354 దగ్గర క్లోజైంది.
భారత్ ఫోర్జ్కు ఆర్డర్ బూస్ట్
భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అయిన కళ్యాణి రఫేల్కు రూ.700 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. నాలుగైదేళ్లలో సుమారు 1000 మిసైల్ కిట్స్ రూపొందించే ఈ ఆర్జర్ నేపధ్యంలో స్టాక్ 5 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ.465 దగ్గర క్లోజైంది.
రిలయన్స్ ఇన్ఫ్రాకు బూస్ట్
ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో ఏకంగా స్టాక్ 16 శాతం వరకూ పెరిగింది. బకాయిపడిన రుణానికి 180 రోజుల్లో ఏదో ఒక పరిష్కార మార్గాన్ని వెతకడంతో పాటు ఉన్న ఆస్తులను అమ్మేసేందుకు గడువు కోరారు అనిల్ అంబానీ. ఇందుకోసం 16 మంది రుణదాతలతో ఓ అంతర్గత ఒప్పందానికి వచ్చారు. ఈ నేపధ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ 11 శాతం లాభాలతో రూ.51.05 దగ్గర క్లోజైంది.
ఇన్ఫోసిస్ - రిజల్ట్స్ నేపధ్యంలో ఒడిదుడుకులు
నేడు మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతోంది. మొన్నటి టిసిఎస్ రిజల్ట్స్కు తోడు గార్ట్నర్ కూడా అంచనాలు తగ్గించడంతో ఇన్ఫోసిస్పై ఆ స్థాయిలో నమ్మకాలు లేవు. దీంతో ఇంట్రాడేలో రూ.709కి పడిపోయిన స్టాక్ చివర్లో కొద్దిగా కోలుకుని రూ.722 దగ్గర క్లోజైంది. 0.7 శాతం లాభపడింది.
డెన్ నెట్వర్క్ హై జంప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ కొద్దికాలం క్రితం కొనుగోలు చేసిన డెన్ నెట్వర్క్స్ సంస్థ షేర్ ఈ రోజు లాంగ్ జంప్ చేసింది. ఈ రోజు ఏప్రిల్ - జూన్ ఫలితాలు విడుదల కాబోతున్న నేపధ్యంలో స్టాక్ 15 శాతం పెరిగింది. చివరకు రూ.63.05 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications