నాలుగు రోజుల వరుస లాభాలకు ఈ రోజు బ్రేక్ పడింది. బడ్జెట్ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్పకూలింది. ప్రసంగం మొదలైన మరింత పతనమైన నిఫ్టీ ఒక దశలో 11800 దిగువకు పడిపోయింది. బడ్జెట్లో పెద్దగా మెరుపులేవీ లేకపోవడంతో పాటు సూపర్ రిచ్కు అదనపు సర్ ఛార్జీ విధింపు, పెద్దగా ప్రోత్సాహకాలేవీ లేకపోవడం కూడా మార్కెట్లను నిరుత్సాహ పరిచింది. దీంతో ప్రధానంగా ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.
బయ్ ఆన్ రూమర్స్.. సెల్ ఆన్ న్యూస్.. అనే నానుడికి తగ్గట్టు.. బడ్జెట్ మొదలైన వెంటనే మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి నిఫ్టీ ఏకంగా 180 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ కూడా 600 పాయింట్ల వరకూ కుప్పకూలింది. చివరకు నిఫ్టీ 136 పాయింట్ల నష్టంతో 11811 దగ్గర, సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 39514 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 4 పాయింట్ల లాభంతో 31476 దగ్గర ముగిసింది.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ టాప్ గెయినర్స్గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, సన్ ఫార్మా షేర్లు లూజర్స్ జాబితాలో నిలిచాయి.
డిఫెన్స్ స్టాక్స్కు దెబ్బ
భారత ఆయుధ వ్యవస్థను పటిష్టం చేసేందుకు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్పై ఇంపోర్ట్ డ్యూటీని మినహాయించాలని చూస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశీయ డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ నష్టాల బాటలో నడిచాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 4 శాతం, భారత్ డైనమిక్స్ 5 శాతం, నెల్కో 2.5 శాతం వరకూ నష్టపోయాయి.
సిగరెట్ కంపెనీల్లో జోష్
సిగరెట్లపై నామమాత్రంగా ఎక్సైడ్ డ్యూటీని పెంచబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో కొన్ని పొగాకు ఉత్పత్తి సంస్థల స్టాక్స్ మిశ్రమంగా స్పందించాయి. ఎందుకంటే భారీగా పన్నును విధించకుండా నామమాత్రంగా విధించడం ఊరటనిచ్చే అంశం.
ఐటీసీ అర శాతం లాభపడితే, వీఎస్టీ 1 శాతం, గాడ్ ఫ్రే ఫిలిప్స్ రెండు శాతం నష్టపోయాయి. మైక్రోక్యాప్ ట్యాక్ గోల్డెన్ టొబాకో 5 శాతం లాభాల్లో ముగిసింది.
బ్యాటరీ కంపెనీలకూ దెబ్బే
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని, వాటి మౌలిక సదుపాయాలను పెంచడానికి మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు విదేశీ సంస్థలను ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ కేంద్రం చేసిన ప్రకటన దేశీయ బ్యాటరీ ఉత్పత్తి కంపెనీలకు షాక్ ఇచ్చింది.
అమర రాజా, ఎక్సైడ్ ట్యాక్స్ రెండు శాతం వరకూ నష్టపోయాయి.
వామ్మో యెస్ బ్యాంక్లో ఏం జరుగుతోంది
వరుసగా నాలుగో రోజు కూడా యెస్ బ్యాంక్ స్టాక్ నష్టాల్లో ముగిసి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినప్పటికీ స్టాక్ ఈ రోజు కూడా 9 శాతం వరకూ పతనమైంది. రూ. 90 దిగువకు వచ్చిన స్టాక్ రూ.88 దగ్గర క్లోజైంది.
గోల్డ్ డ్రాప్
బంగారంపై ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీని రెండున్నర శాతం చొప్పున పెంచడంతో జ్యువెల్రీ స్టాక్స్లో అమ్మకాలు ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. తంగమాయిల్ జ్యువెలర్స్ 9 శాతం పతనమైంది. పిసి జ్యువెలర్స్ 5 శాతం కోల్పోగా, టైటన్ 1 శాతం వరకూ దిగొచ్చింది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications