నాలుగు రోజుల వరుస లాభాలకు ఈ రోజు బ్రేక్ పడింది. బడ్జెట్ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్పకూలింది. ప్రసంగం మొదలైన మరింత పతనమైన నిఫ్టీ ఒక దశలో 11800 దిగువకు పడిపోయింది. బడ్జెట్లో పెద్దగా మెరుపులేవీ లేకపోవడంతో పాటు సూపర్ రిచ్కు అదనపు సర్ ఛార్జీ విధింపు, పెద్దగా ప్రోత్సాహకాలేవీ లేకపోవడం కూడా మార్కెట్లను నిరుత్సాహ పరిచింది. దీంతో ప్రధానంగా ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.
బయ్ ఆన్ రూమర్స్.. సెల్ ఆన్ న్యూస్.. అనే నానుడికి తగ్గట్టు.. బడ్జెట్ మొదలైన వెంటనే మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి నిఫ్టీ ఏకంగా 180 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ కూడా 600 పాయింట్ల వరకూ కుప్పకూలింది. చివరకు నిఫ్టీ 136 పాయింట్ల నష్టంతో 11811 దగ్గర, సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 39514 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 4 పాయింట్ల లాభంతో 31476 దగ్గర ముగిసింది.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ టాప్ గెయినర్స్గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, సన్ ఫార్మా షేర్లు లూజర్స్ జాబితాలో నిలిచాయి.
డిఫెన్స్ స్టాక్స్కు దెబ్బ
భారత ఆయుధ వ్యవస్థను పటిష్టం చేసేందుకు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్పై ఇంపోర్ట్ డ్యూటీని మినహాయించాలని చూస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశీయ డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ నష్టాల బాటలో నడిచాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 4 శాతం, భారత్ డైనమిక్స్ 5 శాతం, నెల్కో 2.5 శాతం వరకూ నష్టపోయాయి.
సిగరెట్ కంపెనీల్లో జోష్
సిగరెట్లపై నామమాత్రంగా ఎక్సైడ్ డ్యూటీని పెంచబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో కొన్ని పొగాకు ఉత్పత్తి సంస్థల స్టాక్స్ మిశ్రమంగా స్పందించాయి. ఎందుకంటే భారీగా పన్నును విధించకుండా నామమాత్రంగా విధించడం ఊరటనిచ్చే అంశం.
ఐటీసీ అర శాతం లాభపడితే, వీఎస్టీ 1 శాతం, గాడ్ ఫ్రే ఫిలిప్స్ రెండు శాతం నష్టపోయాయి. మైక్రోక్యాప్ ట్యాక్ గోల్డెన్ టొబాకో 5 శాతం లాభాల్లో ముగిసింది.
బ్యాటరీ కంపెనీలకూ దెబ్బే
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని, వాటి మౌలిక సదుపాయాలను పెంచడానికి మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు విదేశీ సంస్థలను ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ కేంద్రం చేసిన ప్రకటన దేశీయ బ్యాటరీ ఉత్పత్తి కంపెనీలకు షాక్ ఇచ్చింది.
అమర రాజా, ఎక్సైడ్ ట్యాక్స్ రెండు శాతం వరకూ నష్టపోయాయి.
వామ్మో యెస్ బ్యాంక్లో ఏం జరుగుతోంది
వరుసగా నాలుగో రోజు కూడా యెస్ బ్యాంక్ స్టాక్ నష్టాల్లో ముగిసి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినప్పటికీ స్టాక్ ఈ రోజు కూడా 9 శాతం వరకూ పతనమైంది. రూ. 90 దిగువకు వచ్చిన స్టాక్ రూ.88 దగ్గర క్లోజైంది.
గోల్డ్ డ్రాప్
బంగారంపై ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీని రెండున్నర శాతం చొప్పున పెంచడంతో జ్యువెల్రీ స్టాక్స్లో అమ్మకాలు ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. తంగమాయిల్ జ్యువెలర్స్ 9 శాతం పతనమైంది. పిసి జ్యువెలర్స్ 5 శాతం కోల్పోగా, టైటన్ 1 శాతం వరకూ దిగొచ్చింది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications