ఒక్క అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అనేట్టు ఉంది స్టాక్ మార్కెట్ తీరు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జూన్ సిరీస్ ప్రారంభం రోజున తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్, నిఫ్టీలు ఎట్టకేలకు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం పన్నెండు వేల పాయింట్లపైన స్థిరంగా ప్రారంభమైన నిఫ్టీ.. పదకొండున్నర గంటల సమయంలో అనూహ్యమైన ఒత్తిడికి లోనైంది. ఒక దశలో బ్యాంక్ నిఫ్టీ 1200 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీలో కూడా 200 పాయింట్లకు పైగా పతనం నమోదైంది.
ఏం జరుగుతోందో తెలిసే లోపే మార్కెట్లు కుదుటపడ్డాయి. మిడ్ సెషన్ తర్వాత కూడా నిస్తేజం అలానే కొనసాగింది. చివరకు సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 39 వేల 715 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 11923 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 31375 వద్ద క్లోజైంది.
ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. పీఎస్యూ బ్యాంక్స్, మెటల్, ఆటో, రియాల్టీ రంగ కౌంటర్లలో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది.

టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఐటీసీ, గ్రాసిం, మహీంద్రా అండ్ మహీంద్రా, జీ ఎంటర్టైన్మెంట్ లూజర్స్ జాబితాలో చేరాయి.
ఎందుకు సడన్ సెల్లింగ్
మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో నిఫ్టీ 12027 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ.. ఉన్నట్టుండి నిఫ్టీ ఏకంగా 188 పాయింట్లు నష్టపోయి 11839కి పడిపోయింది. ఇలా ఎందుకు జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే మళ్లీ ఆరు నిమిషాల్లో నిఫ్టీ 70 పాయింట్లకు పైగా రికవర్ అయింది. ఎవరో హెచ్ ఎన్ ఐ.. ప్రోగ్రామ్ బేస్డ్ సెల్లింగ్ చేసి ఉంటారని, అందుకే ఈ తరహా సెల్లింగ్ వచ్చి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications