స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసింది. మూడు వారాల తర్వాత వరుసగా రెండో రోజు కూడా మెరుగైనా లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ 10800 పాయింట్ల సెంటిమెంట్ మార్క్ను క్రాస్ చేసినప్పటికీ నిలబెట్టు కోలేకపోయింది. బ్యాంకులు, మెటల్స్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. చివరకు నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,790 పాయింట్ల దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 150 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 97 పాయింట్ల లాభపడ్జాయి.
ఇండియాబుల్స్ హౌసింగ్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, వేదాంతా, డాక్టర్ రెడ్డీస్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. ఇన్ఫ్రాటెల్, బిపిసిఎల్, యెస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి స్టాక్స్ టాప్ 5 లూజర్స్గా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ న్యూస్తో ఫ్లాట్గా మొదలైన ప్రదాన సూచీ నిఫ్టీ ఒక దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 10721 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగొచ్చింది. అయితే 11 గంటల సమయం నుంచి కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు లభించింది. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూడని మార్కెట్లు అదే ఊపుతో 10809 పాయింట్ల వరకూ వెళ్లింది. చివర్లో కొద్దిగా లాభాల స్వీకరణ రావడంతో 20 పాయింట్లు కోల్పోయింది. ఫార్మా, మెటల్, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ స్టాక్స్లో జోరు నమోదైంది. అయితే ఐటి స్టాక్స్ మాత్రం ఈ రోజు కాస్త దిగాలు పడ్డాయి. ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ మార్కెట్లను పైకి లాగితే, ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్ నిఫ్టీని డౌన్ సైడ్ డ్రాగ్ చేశాయి.
మెటల్స్ స్టాక్స్ లాభాలు
వరుస పతనాలతో ఇంతకాలం ఇబ్బంది పడ్డ మెటల్ స్టాక్స్ వరుసగా మూడో రోజు కూడా లాభపడ్డాయి. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ మెటల్ ప్యాక్ను లీడ్ చేశాయి. ఇది 4.5 శాతం వరకూ లాభపడింది. జిందాల్ స్టీల్, వేదాంతా, వెల్స్పన్, సెయిల్ రెండు శాతానికిపైగా పెరిగాయి. నాల్కో మాత్రం వరుసగా పతనమవుతూనే ఉంది.

అంబానీ ఆఖరి అస్త్రం
ఎరిక్సన్ క్లాస్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. రిలయన్స్ క్యాపిటల్లో భాగస్వామి అయిన నిప్పన్ ఇన్సూరెన్స్ను ఆహ్వానించిన సంస్థ, అవసరమనుకుంటే 42.88 శాతం వాటాను కొనుక్కోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్లో నిప్పన్కు 42.88 శాతం వాటా ఉంది. వాటాల అమ్మకం ద్వారా నిధులను సమీకరించి ఎరిక్సన్కు బకాయిపడిన రూ. 440 కోట్లను వెంటనే చెల్లించేయాలని అనిల్ అంబానీ చూస్తున్నారు.
ఈ వార్తల నేపధ్యంలో అడాగ్ గ్రూపులో ఉన్న స్టాక్స్ అన్నీ పెరిగాయి. రిలయన్స్ క్యాపిటల్ 11 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 9 శాతం, రిలయన్స్ పవర్ 5 శాతం పెరిగాయి. నిప్పన్ మాత్రం 20 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయి రూ.185 దగ్గర క్లోజ్ అయింది.
టెక్ మహీంద్రా బై బ్యాక్
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా స్టార్ లైఫ్ టైం హై స్థాయికి వెళ్లింది. షేర్ బైబ్యాక్ను సంస్థ ప్రతిపాదించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రూ.950 చొప్పున స్టాక్స్ బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో టెక్ మహీంద్రా స్టాక్ రూ. 820 దగ్గర ట్రేడవుతోంది. సుమారు రూ.1956 కోట్లతో 2.1 శాతం షేర్లను తిరిగి సంస్థ కొనుగోలు చేయనుంది.
ఈ వార్తల నేపధ్యంలో టెక్ మహీంద్రా స్టాక్ 1.07 శాతం పెరిగి రూ.820 దగ్గర ముగిసింది.
ప్రభుత్వ బ్యాంకులకు మూలధన కిక్
ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం మూలధన ఆర్థిక సాయం చేయడంతో సదరు బ్యాంక్ స్టాక్స్ ఎగిరి గంతేశాయి. సెంట్రల్ బ్యాంక్ స్టాక్ 7 శాతం లాభపడింది. సిండికెట్ బ్యాంక్ 3.7 శాతం, ఐడిబిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3 శాతం పెరిగాయి.
హౌసింగ్ స్టాక్స్ హాట్ మూవ్
గృహ రుణాల వ్యాపారంలో ఉన్న స్టాక్స్ అన్నీ ఈ రోజు ఎగిరి గంతేశాయి. ప్రధానంగా క్యాన్ఫిన్ హోమ్స్ 7 శాతం పెరిగితే, ఐబి హౌసింగ్, పీఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 5.5 శాతం, దివాన్ హౌసింగ్ 5.2 శాతం పెరిగాయి. ఇదే బాటలో రెప్కో, జీఐసీ, గృహ్ ఫైనాన్స్ 3 శాతం వరకూ పెరిగాయి. రిలయన్స్ హోం ఫైనాన్స్ 10 శాతం పెరిగింది
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications