గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్: బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారానికి వడ్డీ

దేశంలోని ప్రజల వద్ద పెద్ద మొత్తంలో ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకం ద్వారా బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, వడ్డీ పొందొచ్చు. అంతేకాదు మీకు వచ్చిన వడ్డీకి పన్ను మినహాయింపు కూడా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రతిపాదించింది.

ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను ఆర్ధిక శాఖ విడుదల చేసింది. ఈ పథకం అమలు చేయడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించనున్నాయి కాబట్టి వాటికీ కూడా రాయితీలను కల్పించనుంది. దీనిపై జూన్ 2 లోగా అటు ప్రజలను, ఇటు సంస్ధలను తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా కేంద్ర ఆర్ధిక శాఖ కోరింది.

Gold Monetisation Scheme: Interest on Deposits to be Tax-Exempt

గోల్డ్ మానిటైజేషన్ పథకం మార్గ దర్శకాలు:

* ఈ పథకం కింద దేశంలోని వ్యక్తులు, సంస్థలు తమ దగ్గరున్న బంగారంలో కనీసం 30 గ్రాములు లేదా అంతకు మించిన మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. వీటిపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాంటివి ఉండవు.

* ఇందులో కోసం గాను తమ వద్ద ఉన్న నగల విలువను భారత ప్రమాణాల సంస్థ (బిఐఎస్‌) గుర్తింపు పొందిన ఏదైనా హాల్‌మార్క్‌ కేంద్రంలో వెల కట్టించి బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవచ్చు. బ్యాంకులో బంగారం సేవింగ్స్ ఖాతా ప్రారంభించి, డిపాజిట్ చేయాలి.

* బంగారం డిపాజిట్ చేయడానికి కాల వ్యవధి కనీసం ఏడాది. దీనిపై వచ్చే వడ్డీని సైతం బంగారం రూపంలో తీసుకోవచ్చు. కాకపోతే ఎలా తీసుకునేది డిపాజిట్‌ చేసే సమయంలో ఖాతాదారులే ఎంచుకోవాలి.

* అయితే ఈ పథకం కింద డిపాజిట్‌పై ఎంత వడ్డీ చెల్లించాలనే విషయం బ్యాంకులే నిర్ణయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

బ్యాంకులకు ప్రత్యేక రాయితీలు:

* గోల్డ్ మానిటైజేషన్ పథకం కింద బంగారం డిపాజిట్లు సేకరించే బ్యాంకులకు సైతం ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించనుంది. బ్యాంకులు తమ వద్ద డిపాజిట్ అయిన బంగారాన్ని నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), ఎస్‌ఎల్ఆర్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

* ప్రస్తుతం బ్యాంకులు తాము సేకరించే డిపాజిట్ల నగదులో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దగ్గర సిఆర్‌ఆర్‌, ఎల్‌ఎల్‌ఆర్‌ రూపంలో డిపాజిట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

* ఈ వాటాను తగ్గించి, గోల్డ్‌ సేవింగ్స్‌ ఖాతా కింద సేకరించిన బంగారంలో కొంత భాగాన్ని ఆర్‌బిఐ దగ్గర డిపాజిట్‌ చేసేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా చేయడం వల్ల బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి.

* బ్యాంకులు ఈ బంగారాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం విక్రయించుకోవచ్చు. దాని ద్వారా వచ్చిన విదేశీ కరెన్సీని ఎగుమతి/దిగుమతి దార్లకు రుణాలు ఇచ్చేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

* అంతే కాదు తమ వద్ద డిపాజిట్‌గా చేసిన బంగారాన్ని నాణేలుగా మార్చి, విక్రయించవచ్చు. దీంతో పాటు నగల వ్యాపారులకు అమ్మడం ద్వారా అదనపు నిధులు సమీకరించేందుకు సైతం అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

* దీంతో బంగారం దిగుమతి తగ్గడంతో పాటు దేశంలో వృధాగా పడి ఉన్న రూ. 60 లక్షల కోట్ల విలువైన 20,000 టన్నుల బంగారాన్ని, దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+