కొత్త పెట్టుబడులపై కార్పోరేట్ ట్యాక్స్ రేట్కు సంబంధించి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ప్రకటన చేశారు. తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు 15% కార్పోరేట్ పన్ను అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించిన గడువు తేదీని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు.

పెట్టుబడులకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయం
దేశ ఆర్థిక వృద్ధి కనిష్టాలకు పడిపోవడంతో పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కంపెనీలకు కార్పోరేట్ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది. అలాగే 2019 అక్టోబర్ 1వ తేదీ నుండి 2023 మార్చి 31వ తేదీ మధ్య తయారీ రంగంలో ఏర్పాటయ్యే కంపెనీలకు కార్పోరేట్ ట్యాక్స్ను 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు గత సెప్టెంబర్లో కార్పోరేట్ పన్నును 10 శాతం తగ్గించింది.

28 ఏళ్లలో తొలిసారి.. గడువు పెంపు పరిశీలిస్తాం
కార్పోరేట్ పన్నును ఇంత భారీగా తగ్గించడం గత 28 ఏళ్లలో ఇదే తొలిసారి. కొత్త పెట్టుబడులపై పరిశ్రమ 15 శాతం కార్పోరేట్ పన్ను ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నామని, మేం ఏం చేయగలమన్నది చూస్తామని, అందుకే మార్చి 31, 2023 గడువు తేదీని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు సోమవారం జరిగిన ఫిక్కీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎంఎస్ఎంఈలు మాత్రమే కాదు..
మన వ్యాపార సంస్థలకు సహకారం అందించేందుకు, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా ఎమర్జెన్సీ లోన్ సౌలభ్యాన్ని ఎంఎస్ఎంఈలు మాత్రమే కాకుండా అన్ని కంపెనీలు వినియోగించుకోవచ్చునని చెప్పారు. వ్యవస్థలో లిక్విడిటీ సమస్య అందుబాటులో ఉందని, ఇందుకు సంబంధించి సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. బకాయిలు పెండింగ్లో ఉంటే తీర్చేయాలని అన్ని ప్రభుత్వ విభాగాలకు సూచించామన్నారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కౌన్సిల్దే అని చెప్పారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications